అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
వివరాల్లోకి వెళితే..వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన గూగులోతు రవినాయక్ కుమారుడు ధర్మ తేజ అదృశ్యం కాగా ఆయన కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగాపురం గ్రామం వీరులపాడు పోలీస్ స్టేషన్ పరధి అయినప్పటికీ కంచికచర్ల పోలీసులు ఆ ఫిర్యాదుపై జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు బృందాలను రంగంలోకి దింపారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ మండలంలో అదృశ్యమైన బాలుడిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.