న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ మౌనంగానే ఉంటున్నారని మండిపడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు నుంచి విడుదలైన పి. చిదంబరం తొలిసారి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అని చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఒకవేళ జీడీపీ వృద్దిరేటు ఐదు శాతానికి చేరితే మనం అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. అరవింద్ సుబ్రమణియన్ చెప్పిన మాటలను గుర్తించుకోవాలని సూచించారు. దేశ జీడీపీ ఐదు శాతం కాదని,1.5శాతం కంటే తక్కువ ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలను చిదంబరం గుర్తుచేశారు. తాను కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక వ్యవహారాల పట్ల తాను చాలా స్పష్టంగా వ్యవహరించేవాడినని చెప్పారు. ఈ విషయం చాలామంది జర్నలిస్టులు, అధికారులకు తెలుసన్నారు. 106 రోజుల అనంతరం నిన్న రాత్రి 8 గంటలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నానని చిదంబరం తెలిపారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మూకదాడులపై చిదంబరం భావోద్వేగానికి గురయ్యారు.
Congress leader P Chidambaram: Prime Minister has been unusually silent on the economy. He has left it to his ministers to indulge in bluff and bluster. The net result, as the Economist put it, is that the government has turned out to be an ‘incompetent manager’ of the economy. https://t.co/algL4hlIJF
— ANI (@ANI) December 5, 2019
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం రాజ్యసభ సమావేశాలకు చిదంబరం హాజరయ్యారు. పార్లమెంట్ ఆవరణలో ఉల్లి ధరలపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన నిరసన కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. తీహార్ జైల్లో 106 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం రాత్రి ఆయన విడుదలయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చిదంబరానికి జైలు నుంచి విముక్తి లభించింది. అయితే, దేశం విడిచి వెళ్లరాదని, ఈడీ అధికారుల విచారణకు ఎప్పటికప్పుడు హాజరు కావాలని సుప్రీంకోర్టు షరతులు విధించిన సంగతి విదితమే.
#WATCH Congress leader P Chidambaram gets emotional while answering a question on rapes & lynchings. pic.twitter.com/UDwY42vQsl
— ANI (@ANI) December 5, 2019