అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై గురువారం ఆయన ట్వీట్ చేశారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కారాదని అన్నారు. భావితరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే టిడిపి తపన అని ఆయన పేర్కొన్నారు. ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అన్నారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేద రిక నిర్మూలనకు దోహదపడేలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
మన బిడ్డలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టాం. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృధా కారాదు, భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ తపన. (2/2)#SaveAmaravati #SaveAndhraPradesh
— N Chandrababu Naidu (@ncbn) December 5, 2019