మనిషి తన ఆలోచనలను అద్దం రఛన. తన ఆలోచలను అక్షర రూపం ఇచ్చి వాటిని లక్ష మెదళ్లకు కదలిక మారుస్తున్నారు. వారి చేసిన పనులు చేసే వారి రఛనలే జీవితాంతం తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. రచన అంటే రాయడం. తన ఆలోచనలో ఉన్న దాన్ని, సమాజంలో తను స్వయంగా ఎదుర్కోకున్న అనుభావాలను రాతపూర్వకంగా ఇంకొకరికి తెలియజేయడం. రచన శైలి కొంచం కష్టం కూడకున్నది. అర్ధం చేసుకోవడం, ఆ అంశాన్ని లిఖితరూపంలోకి అనువాదం చేయడంలో ఎదురయ్యే సమస్యలను ప్రాక్టీస్ చేయడం ద్వారా రచనను మరింత అర్థవంతంగా చేయవచ్చు.
ముఖ్యంగా రాయడం అంటే భాష కాదు. కానీ మానవుడు తన భావవ్యక్తీకరణకు అభివృద్ధి చేసుకున్న లిపి రూపం. భాషా పదాలు, వ్యాఖ్యలు, పద ప్రయోగంలాంటివి అవి భాషా కున్న సంకేతిక రూపం. మనం భాషాను ఏవిధంగా మాట్లాడానికి ఉపయోగిస్తామో రాయడంలోనూ అదేవిధంగా ధోరణిని పాటించినట్లయితే సులభంగా రాయడం అలవాటవుతుంది. మనం రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైన గుర్తపెట్టుకోవాలి.
రాసేటప్పుడు పాఠకులను దృష్టిలో పెట్టెకోవాలి. రాసే ఆలోచనలలో స్పష్టత ఉండాలి. మీ దృఫ్టి కోణంలో కాకుండా ఇతరుల కోణంలో అలోచించాలి. రాసినదాన్ని ఒకటికి రెండుసార్లు చదవడం ద్వారా మనకే అర్థమౌతుంది. పొడవైన వాక్యాలను కాకుండా పొట్టి వాక్యాలను రాయడం అలవాటు చేసుకోవాలి. కష్టమైన పదాలు కాక, సులువైన పదాలు, పదబంధాలు రాయడం మంచిది. వ్యాఖ్యలలో మధ్యలో కామాలు, ఫుల్స్టాప్లు వాడటం వలన మన రాసే రచనకు స్పష్టత వస్తుంది. చెప్పే విషయాన్ని కథ చెబుతున్నట్లు రాయండి. రాసినదాన్ని స్నేహితులకో, తెలిసినవారికో చూపించడం ద్వారా తప్పొప్పులను తెలుస్తాయి. ప్రతిరోజూ ఏదో ఒకటి రాస్తూ ఉండటం మంచిది. రాసిన వాటిలో తప్పొప్పులను సరిచేసుకోవాలి. మనం కీలక అంశాన్ని విభిన్న కోణాలను ఆలోచి్ంచి రాయాలి. విషయాన్ని ఎంత ఎక్కువ చదివితే అంత బాగా రాయగలం. ఇకా మీలో దాగి ఉన్న ఆ అంతర్గత ప్రతిభను బయటకు తీయండి.