Dhanush Ishwarya: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది విడిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది సమంత నాగచైతన్య ఇద్దరు బాగా చర్చించుకుని దాంపత్య జీవితం నుండి ఎవరికి వారు ఉండాలని విడిపోతున్నట్లు.. ప్రకటించడం అప్పట్లో అందరికీ ఝలక్ ఇచ్చినట్లయింది. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమించుకున్న నాగచైతన్య, సమంత తర్వాత రెండు కుటుంబ సభ్యుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఊహించని రీతిలో పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకి ఇద్దరూ విడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అభిమానులైతే చాలా బాధపడ్డారు.
ఇప్పుడు ఇదే రీతిలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్, ఐశ్వర్య సేమ్ నాగచైతన్య సమంత మాదిరిగానే విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవల ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుండో కలిసి ఉన్న ఈ జంట విడిపోవటం తమిళ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులకు బయట అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అయింది. ధనుష్ ఐశ్వర్య జంటను చాలా మంది అభిమాని స్తుంటారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ధనుష్ ఐశ్వర్య మళ్లీ కలవాలని తెగ కోరుకుంటున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఓ టాప్ హీరోయిన్ వీరిద్దరిని కలపాలని.. రంగంలోకి దిగటం మాత్రమేకాక సోషల్ మీడియాలో 24 గంటలో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ సెట్ చేయాలని… డిసైడ్ అయిందట. ధనుష్ ఐశ్వర్య టోగేదర్ అనే టైటిల్ తో.. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయాలని మలయాళ నటి లక్ష్మీ రామకృష్ణన్ రంగంలోకి దిగటం జరిగిందట. ఇక ఇదే తరుణంలో నెగిటివ్ ప్రచారం చేసి నెటిజన్లను ఇటువంటి సమయంలో ఆ రీతిగా చేయకూడదని లక్ష్మీ రామకృష్ణన్ హెచ్చరించడం జరిగింది. వాళ్ల మానసిక ప్రశాంతత కోల్పోకుండా అభిమానులు మరియు నెటిజనులు ఈ సమయంలో నెగిటివ్ ప్రచారం చేయకుండా.. అందరూ హందాగా వ్యవహరించాలని ఈ టాప్ హీరోయిన్ అందరినీ కోరడం జరిగిందట.