(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సోషల్ మీడియా పోస్టుతో ఒక పరుగుల వీరుడి ప్రతిభ కేంద్ర క్రీడా శాఖ మంత్రి దృష్టిని ఆకర్షించింది.మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురికి జిల్లాకు చెందిన గ్రామీణ క్రీడాకారుడు రామేశ్వర్ కనీసం చెప్పులు లేకుండా వంద మీటర్ల పరుగును 11 సెకన్లలో ఛేదించాడు. తన రన్నింగ్ ప్రతిభను రామేశ్వర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ క్రీడాకారుడి ప్రతిభను ప్రశంసిస్తూ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుకి ట్యాగ్ చేశారు. భారత్లో వ్యక్తిగత నైపుణ్యానికి కొదవలేదనీ, వారికి సరైన వేదిక లభిస్తే ప్రతిభను నిరూపించుకుంటారని చౌహాన్ పేర్కొన్నారు. ఈ యువకుడిని ప్రోత్సహిస్తే దేశానికి పేరు తీసుకురాగలడన్న నమ్మకం ఉందని చౌహాన్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి రిజుజు ఆ యువకుడిని తన వద్దకు పంపాలనీ, అతన్ని అకాడమిలో చేర్పించి ఇంకా మెరుగయ్యేలా మంచి శిక్షణ ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చారు.
https://twitter.com/KirenRijiju/status/1162418671295201280