టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగింది. చాలావరకు ఏబీఎన్ ఆర్కే చంద్రబాబు ని సపోర్ట్ చేసే రీతిలో వ్యవహరిస్తుంటారు అని ముందు నుండి ఏపీ రాజకీయాల్లో ఒక టాక్ ఉంది. టీడీపీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారి పై బురద చల్లే విధంగా కథనాలు మీద కథనాలు ప్రసారం చేస్తూ రాధాకృష్ణ వ్యవహరిస్తుంటారు అని చాలామంది ఏపీ సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు.
అందుకే ఫోకస్ ఇటు షిఫ్ట్ అయింది
ఇందువల్లే వైయస్ జగన్ కూడా తన సమావేశాలకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏబీఎన్ ఛానల్ నీ గాని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతినిధులను గాని రాణించే వారు కాదట. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ చాలా వరకు మీడియా ని కంట్రోల్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ, ఏమైనా తేడా చేస్తే చిన్న చిన్న షాకులు ఇస్తున్నారు. దీంతో ఏబీఎన్ ఆర్కే ఏపీ ప్రభుత్వంపై గాని వైయస్ జగన్ మీద గాని వ్యతిరేకంగా వార్తలు వడ్డించడం లో చాలా ఆలోచన చేసే పరిస్థితి నెలకొంది. కానీ మరోపక్క ప్రతిపక్షంలో టిడిపి చాలా వరకు బలహీనం కావడంతో ఆ స్థానాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నా బీజేపీని తాజాగా ఏబీఎన్ ఆర్కే టార్గెట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు రంగంలోకి దిగటం తోనే టిడిపిని మరియు టిడిపి పార్టీ నుండి బీజేపీ లోకి వచ్చిన నాయకులను అదుపులో పెట్టే రీతిలో వ్యవహరించారు. దీంతో ఏపీలో టీడీపీ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని బిజెపి కైవసం చేసుకునే పరిస్థితి నెలకొంది. కాగా వ్యవహారం మొత్తం అదుపుతప్పేలా కనిపిస్తూ ఉండటంతో టిడిపి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే విధంగా రాజకీయం ఉండటంతో ఏబీఎన్ ఆర్కే తన తాజా కొత్త పలుకులో బిజెపి పార్టీని టార్గెట్ చేశారు.
సోము తో మొదలైంది….
బెజెపి జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ని టార్గెట్ చేసి ఆర్కే ఒక వ్యాసం రాశారు. “మీ జీవిఎల్…. మీ ఇష్టం” అంటూ ఏబీఎన్ ఆర్కే రాసిన ఆదివారం కొత్త పలుకు వ్యాసం లో… బీజేపీ పార్టీ పై ఎనలేని ప్రేమ చూపించే రీతిలో వ్యాసం రాశారు. దెబ్బకి దీని పై బీజేపీ నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నేరుగా రంగంలోకి దిగి జీవీఎల్ పై ఏబీఎన్ ఆర్కే రాసిన ఆర్టికల్ పై మండిపడ్డారు. గతంలో మోడీని ఆయన కుటుంబాన్ని మరియు బిజెపి పార్టీ ని టార్గెట్ చేసిన మీరు మా పార్టీ పై చూపిస్తున్న ప్రేమ ఆశ్చర్యం కలిగించే రీతిగా ఉందని అన్నారు. ఏపీలో లో మేము ఎదగడం లేదని మీరు ఇంతగా బాధ పడతారని మేము కలలో కూడా అనుకోలేదని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది అంటూ ఆర్కే కి లెటర్ రాసి వీపు విమానం మోత మోగించే రీతిలో సోము వీర్రాజు చురకలంటించారు.
అసలాయనా…. ఒక చేయి వేశారు!
అది అయిపోయిన తర్వాత వెంటనే నేరుగా రంగంలోకి దిగిన జీవీఎల్… మీడియా ముందుకు వచ్చి దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో…. రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి పార్టీ పరిస్థితి అలా ఉంది అని చెప్పుకొచ్చారు. అదేరీతిలో తనపై ఇటీవల టిడిపి పార్టీని అభిమానించే పత్రిక అధినేత ఒకరు వ్యాసం రాశారు. తనపై వచ్చినట్టు కాంగ్రెస్ టిడిపిల ను కూడా “మీ రాహుల్ మీ ఇష్టం”, “మీ లోకేష్ మీ ఇష్టం” అని మరో వ్యాసం రాయగలరో లేదో చూడాలి అంటూ చురకలు అంటించారు.
మొత్తం మీద ఏపీ బీజెపీ ని టార్గెట్ చేసిన ఏబిఎన్ ఆర్కే ని బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు భయంకరంగా ఆడుకుంటున్నారు. దీంతో ఆయన పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. రాబోయే రోజుల్లో టిడిపి పార్టీకి మద్దతు తెలపడం మానేస్తారా? … ఏమీ పట్టించుకోకుండా యధావిధిగా టీడీపీకి… మద్దతు తెలిపే రాతలు రాస్తారా? అన్నది ఏపీ రాజకీయాలు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. మొత్తంమీద చూసుకుంటే ఏబిఎన్ ఆర్కే కి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ పరిస్థితి ఏర్పడినట్లు మీడియా వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.