NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Legislative Council: ఆ రెండు పోస్టులు ఆ ఇద్దరికేనా?దాదాపు ఫిక్స్ అంటున్న వైసీపీ వర్గాలు!!

AP Legislative Council: ఏపీ శాసనమండలి చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.శనివారం నాడు అధికార వైసిపిలో ఇదే విషయమై మంతనాలు సాగాయి.ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పదవీకాలం పూర్తి అయింది.అలాగే డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సత్యనారాయణ టర్మ్ కూడా మరో పదిహేను రోజుల్లో పూర్తికానున్నది.వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.అయితే ప్రస్తుతం శాసనసభలో వైసీపీకి ఉన్న బంపర్ మెజారిటీ కారణంగా శాసనమండలిలో కూడా ఆ పార్టీ త్వరలోనే మెజార్టీ సాధించబోతోంది.ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక మీద వైసీపీ అధిష్టానవర్గం కూడా దృష్టి సారించింది.

Are those two posts for those two?
Are those two posts for those two?

ఇక్బాల్ ,జంగాలకు ఛాన్స్!

పదవీ విరమణ చేస్తున్న షరీఫ్ ,రెడ్డి సుబ్రమణ్యం ల సామాజిక వర్గాలకే వైసీపీ కూడా శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ ప్రకారం చూస్తే మహ్మద్ ఇక్బాల్(మైనారిటీ ), జంగా కృష్ణమూర్తి (బి.సి)లకు ఆ పదవులు దక్కే అవకాశం మెండుగా ఉంది.ఈ ఇద్దరూ కూడా పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు.ముఖ్యమంత్రి గీచిన గీతను వారు దాటే ప్రసక్తే ఉండదు. ఇలాంటి నమ్మకస్తులే శాసనమండలిలో ఆ కీలక పదవుల్లో ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ భావిస్తోంది. పైగా పదవీ విరమణ చేస్తున్న వారి సామాజిక వర్గాలకు చెందిన వారికే ఈ పదవులు ఇవ్వడం రాజకీయంగా కూడా కలిసి వస్తుందని వైసీపీ అంచనా.

Read More: Anandaiah medicine: ఆనందయ్య మందుపై వందల కోట్ల వ్యాపారం..! ఇది ఇంకేం ఉచితం?

AP Legislative Council: వీరిద్దరూ ఎవరంటే !

మహ్మద్ ఇక్బాల్ పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైసీపీ నుండి పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.మైనార్టీ కోటాలో ఆయనకు వెంటనే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.ఈ మధ్యే ఆయన పదవీకాలం పూర్తి కాగా మళ్లీ ఎక్స్ టెన్షన్ కూడా ప్రసాదించారు.ఇక జంగా కృష్ణమూర్తి గురజాలలో 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.అయితే ఆయనకు వెంటనే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆదరించారు.బీసీ నేతగా ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యం ఉంది.వారి అర్హతలన్నీ పక్కనబెడితే జగన్ కి మహా గట్టి నమ్మకస్తులు.శాసనమండలిలో నారా లోకేష్ వంటివారిని డీల్ చెయ్యాలంటే లాంటి వారిని చైర్మన్,డిప్యూటీ చైర్మన్ లుగా చేయడం అవసరమన్నది వైసీపీ వర్గాల భావన.ఇప్పటివరకు ఉన్న అప్ డేట్ ప్రకారమయితే వీరిద్దరికే ఈ రెండు కీలక పదవులు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వైసీపీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.

 

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju