న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ చిదంబరంను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇవాళ కోర్టులో విచారణ కోసం తమకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరితే..14 రోజుల కస్టడీకి ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సీబీఐ తర్వాత ఈడీ కూడా విచారణకు రెడీగా ఉంది. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి భారీగా నిధులు రావడంపై మనీలాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ ప్రశ్నించనుంది.
ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకేమీ సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి ఇలా కేసుల్లో ఇరికిస్తుందని చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆరోపిస్తున్నారు. తన తండ్రికి ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు.
previous post
next post