న్యూఢిల్లీః కశ్మీర్లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల బృందాన్ని వెనక్కి తిప్పి పంపడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జాతీయవాదం పేరుతో కశ్మీర్ ప్రజలను అణచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రియాంక ట్విట్ చేశారు. శ్రీనగర్ నుంచి విమానంలో వస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ వద్దకు వచ్చిన ఓ కశ్మీర్ మహిళ కన్నీటి పర్యంతం అవుతూ తమ కష్టాలను వెళ్లబోసుకున్న వీడియోను కూడా ప్రియాంక ట్వీట్ చేశారు. ఇలాంటి వారు కశ్మీర్లో లక్షల మంది ఉన్నారంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
there is NOTHING more ‘political’ and ‘anti national’ than the shutting down of all democratic rights that is taking place in Kashmir. It is the duty of every one of us to raise our voices against it, we will not stop doing so.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 25, 2019