లడాఖ్: కాశ్మీర్ పై పాకిస్థాన్ కు ఎప్పుడూ ఏడుపేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్పై పాకిస్థాన్కు ఎటువంటి అధికారం లేదన్నారు. లడాఖ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్, లడాఖ్ ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని అన్నారు. కశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉగ్రదాడులతో భారత్ను నాశనం చేయాలని చూస్తున్న పాక్తో శాంతి చర్చలు ఎలా జరుపుతామని ఆయన ప్రశ్నించారు. పాక్తో మంచి స్నేహసంబంధాలు కొనసాగించాలనే తాము కోరుకుంటున్నామని, అయితే, మొదట ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాభాగమే రాజ్నాథ్ స్పష్టం చేశారు. భారత్పై ఏడవడం మానేసి పీవోకేలో మానవహక్కుల ఉల్లంఘనపై పాక్ దృష్టిపెడితే బాగుంటుందని సూచించారు. భారత్పై పడి ఏడవొద్దని పాకిస్థాన్కు రాజ్నాథ్ హితవు పలికారు. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ పరిణామాల తర్వాత లడాఖ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ పర్యటించడం ఇదే మొదటి సారి.
पाकिस्तान का कश्मीर में कोई Locus Standi नहीं है। जबकि गिलगिट-बाल्टिस्तान समेत पूरे POK पर उसने ग़ैर क़ानूनी क़ब्ज़ा जमाया हुआ है।
हमारे देश की संसद ने फ़रवरी 1994 को एक सर्वसम्मत प्रस्ताव पारित किया जिसमें भारत की स्थिति पूरी तरह स्पष्ट कर दी गयी है।
— Rajnath Singh (@rajnathsingh) August 29, 2019
मैं पाकिस्तान से पूछना चाहता हूं कि कश्मीर पाकिस्तान के पास था कब? और पाकिस्तान भी तो इसी भारत से निकल कर बना है।
हम पाकिस्तान के वजूद का सम्मान करते हैं इसका अर्थ यह नहीं है कि वह कश्मीर को लेकर कोई लगातार बयानबाजी करता रहेगा।
— Rajnath Singh (@rajnathsingh) August 29, 2019