కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని మద్దతు ఇస్తున్నారని అయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా పరిపాలన ఎక్కడ కనిపించడంలేదని అన్నారు. రాజధాని తరలిoపులో భాగంగా విశాఖపట్టణంలో రైతుల దగ్గర భూములు అడిగితే వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోయాయని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పాతాళానికి నెట్టిన నాయకుడు సిఎం జగన్మోహన్ రెడ్డని దుయ్యబట్టారు. ఇసుక రాంపులు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారని చినరాజప్ప విమర్శించారు.
previous post