(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను దిగుమతి చేసుకునే ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో ఇండియా 17వ స్థానంలో ఉన్నది. జర్మనీకి చెందిన హంబోల్డ్ యూనివర్సిటీ, కోష్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ సంగతి తేలింది.
చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 800 మందికి పైగా మృతి చెందారు. 40 వేల మందికి పైగా దీని బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల విమానాశ్రయాల మధ్య నడిచే 25 వేల సర్వీసులను రిలేటివ్ ఇంపోర్ట్ రిస్క్ కోసం అధ్యయనం చేశారు. రిలేటివ్ ఇంపోర్ట్ రిస్క్ అంటే వైరస్ వ్యాప్తి జరిగిన దేశం (చైనా) నుంచి వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో దేశానికి నేరుగా విమానం ద్వారా రావడం.
ఢిల్లీ ఎయిర్పోర్టుకు ఈ రిస్క్ 0.066 శాతం ఉందని అధ్యయనంలో తేలింది. ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టుకు 0.034 శాతం, కోల్కతా నేతాజీ సుభాష్చంద్ర బోస్ ఎయిర్పోర్టుకు 0.020 శాతం రిస్క్ ఉందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం ఇండియా మొదటి 20 దేశాల జాబితాలో ఉంది.