Trivikram: 2020 లో టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను “అలవైకుంఠపురం లో” సినిమా ద్వారా తిరగరాశాడు డైరెక్టర్ త్రివిక్రమ్. అంతటి భారీ హిట్ రావడంతో వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమా అని.. చాలా ప్రతిష్టాత్మకంగా సినిమా నిర్మాణం జరుగుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ రావటం వెంటనే కొరటాలతో తన 30 సినిమా చేస్తున్నట్లు ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.
దీంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించినా గాని త్రివిక్రం ఏడాదికి పైగా గ్యాప్ రావడం జరిగింది. ఈ పరిణామంతో ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అవగానే త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని లైన్ లో పెట్టడం జరిగింది. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అవటం మహేష్ అభిమానులలో సందడి వాతావరణం నెలకొనగా, ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ పెద్ద హాట్ టాపిక్ అయింది.
Read More: Sarkaru vari pata : సర్కారు వారి పాట ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మహేష్ బాబు లుక్ మార్చేసిన పరశురాం..!
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అతడు”, “ఖలేజా” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించటంతో… వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో.. జూలై మాసంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన షూట్ జులై నెలలో ప్రారంభించి… “సర్కారు వారి పాట” సినిమా మొత్తం పూర్తయ్యాక … రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.