ఇప్పటికే కీలక నేతల అరెస్టులతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దానికి తగ్గట్టు పార్టీలోనే అత్యంత సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడి పై కూడా నిర్భయ కేసు పెట్టడంతో అతని అరెస్టు కూడా రేపోమాపో జరుగుతుంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి స్వయంగా జగన్ చేతికి బాబు గారు దొరకడం గమనార్హం.
ఇప్పటి వరకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు వాటిలో భాగంగానే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు మంజూరు చేసిన మైనింగ్ లీజు వ్యవహారంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు చేశారు. అలాగే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు సైతం ఈ వ్యవహారంలో అనేక కథనాలు ప్రచురితం చేశాయి. ప్రభుత్వం సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ వ్యవహారంలో ఎన్నో అక్రమాలకు వెసులుబాటు కల్పించింది అని వచ్చిన ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు.
ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా తిప్పికొడుతూ వచ్చినా హైకోర్టు జీవో నెంబర్ 2430 లో మాత్రం వారికి మద్దతుగానే వ్యవహరించింది. దాని ప్రకారం ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం పైన వ్యక్తులు గాని, మీడియా సంస్థలు గాని వార్తాపత్రికలు గాని అవినీతి ఆరోపణలు చేయడం లేదా వారి పరువు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని దాని సారాంశం. కాబట్టి ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి) అనగా మన ఏబీఎన్ రాధాకృష్ణ కి, ఉషోదయ పబ్లికేషన్స్ (ఈనాడు పత్రిక) రామోజీరావుకి ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని నోటీసులు పంపించడం జరిగిందని గోపాలకృష్ణ వెల్లడించారు.
అంతేకాకుండా ఈ నోటీసులు అందిన వెంటనే వీరు స్పందించి క్షమాపణ చెప్పాలని…. అలాగే రాబోయే రోజుల్లో కూడా పత్రికలు ప్రచిరించే ఇలాంటి వార్తలకు ప్రభుత్వం దగ్గర నుండి వివరణ తీసుకోవాలని…. తీసుకోకుండా వార్తలను ప్రచురిస్తే మళ్లీ ఇదే పునరావృతం అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి లీగల్ నోటీసు ఇచ్చామని…. వెంటనే క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఎలాగో ఈ విషయంలో బాబు క్షమాపణలు చెప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అలా చేస్తే ఇక్కడ టిడిపి కార్యకర్తల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇక ప్రస్తుతం వైసీపీ ఉన్న జోరు చూస్తుంటే బాబుని కోర్టు బోనులో నిలబెట్టే వరకు ఆగేలా లేదు. మరి బాబు ఈ విపత్కర పరిస్థితి నుండి ఎలా తప్పించుకుంటాడో వేచి చూడాలి.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!