Krishna Mukunda Murari April 4 2024 Episode 436: ఈరోజు ఎపిసోడ్ లో, రేవతి ముకుంద కి 11 రోజు పిండి ప్రదానం చేయాలి అని భవానీతో చెప్తుంది. మనం చేయాల్సింది చేయాలి కదా అక్క అని అంటుంది అందుకు భవాని ఉన్నంతకాలం ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసింది కనీసం చనిపోయిన తర్వాత అయినా తన ఆత్మ కైనా మనశాంతి ఉండాలి కాబట్టి కచ్చితంగా చేద్దాం రేవతి అని అంటుంది. భవానీ దేవి ఎవరిని రావాలో చెబుతుంది ఎవరెవరిని పిలవాలో చెప్తుంది. శ్రీనివాస్ ని కూడా ముకుంద పిండ ప్రదానానికి పిలువు అని అంటుంది అక్కడే ఉన్న మధు ఆయన్ని పిలవడం ఏంటి పెద్ద పెద్దమ్మ ఆయన వల్ల అసలు మురారి ఎంత బాధ పడ్డాడో మీకు తెలియదు అని అంటాడు. వెంటనే అది ఆయన చేయడం ఆయన మూర్ఖత్వం కానీ మనం ఆయనని పిలిచి మన సంస్కారం ఏంటో చూపించాలి కదా అని అంటుంది భవాని.
ఇక రేవతి సరే అక్క అని అంటుంది శ్రీనివాస్ వస్తాడు రాడు అని నందు అంటుంది. వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం, ముకుంద ఉన్నప్పుడే ఆయనతో డీలింగ్స్ మనకి తక్కువ ఇప్పుడు ముకుందే లేదు ఈ ఒక్క కార్యక్రమానికి ఆయనని మనం పిలిస్తే తర్వాత ఆయన మన ఇంటికి వచ్చేది లేదు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు అని అంటుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరూ మేము రావట్లేదు అని చెప్తారు దానికి భవాని దేవి ఎందుకు అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆదర్శ మంచిది ఉన్నంతకాలం దూరం పెట్టాలనుకున్నారు ఇప్పుడు తను శాశ్వతంగా దూరం అయిపోయింది మీకు కావాల్సింది అదే కదా కానీ ఇవ్వండి అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. భవాని దేవి ఎవరికి అప్పుడు అర్థం అవ్వాలో అప్పుడు అర్థమవుతుంది అని అంటుంది. ఇక నందు అమ్మ ఆదర్శన్నయ్య రావట్లేదు అని అంటుంది ఆదర్శని పిలవలేదా అని రేవతిని అడుగుతుంది భవాని పిలిచాను అక్కయ్య కానీ రాను అంటున్నాడు అని అంటుంది రేవతి వాడు రాకపోతే శ్రీనివాస్ ఉన్నాడు కదా కార్యక్రమం చేయడానికి ఆయనే చేస్తాడు ఒకవేళ ఆయన కూడా రాకపోతే పంతులుగారు కార్యక్రమం చేయిస్తాను ఇంతకీ ముకుంద ఫంక్షన్ కి మీరు అని పిలిచావా అని అంటుంది పిలిచాను అక్కయ్య తప్పకుండా వస్తాను అని చెప్పింది అని అంటుంది రేవతి.
ఇక ముకుందా అద్దం ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అద్దంలో ఎదురుగా తన అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. ఏం బతుకే నీది అసలు నీ పెంట ప్రధానానికి నువ్వు వెళ్లడం ఏంటి అని అంటుంది అంతరాత్మ. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు కూడా అర్థం కావట్లేదు ముకుందాగా నీ రూపం నీకు ఉన్నప్పుడే నిన్ను మురారి పట్టించుకోలేదు మొదట ప్రేమించిన తరువాత కృష్ణ రాగానే నిన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఈ రూపంలో నిన్ను మురారి ఇష్టపడతాడని ఎలా అనుకుంటున్నావు అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. అయినా పిండ ప్రధానం చేయడం ఎంత కష్టమో తెలుసా? మీ నాన్న నువ్వు బతికుండగా పిండ ప్రదానం చేయడం నిజం చెప్పకుండా దాచిపెట్టడం అంటే ఆయన ఎంత బాధ పడతాడో తెలుసా అయినా ఎవరి బాధపడితే మనకేంటి మనకు కావాల్సింది మురారిని దక్కించుకోవడం దాని కోసం చావడం తప్ప ఏదైనా చేయొచ్చు. నువ్వు మాత్రం పనుంటే ప్రధానం చేరడానికి వెళ్ళు అక్కడ ఏం జరిగితే మనకేంటి కార్యక్రమం మనకు కావాల్సింది మురారి అని అంతరాత్మ మీరు అలా కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది ఇక ముకుందా మీరాగా తన పిండ ప్రధానానికి తానే వెళ్లనుంది.
ఇటు శ్రీనివాస్ భవానీ దేవి ఎందుకు రమ్మని చెప్పారు నాతో గొడవపడడానికి అయి ఉంటుంది అయినా నాతో ఇప్పుడు గొడవపడడం ఏంటి తను అమెరికా నుంచి రాగానే నా ఇంటికి వచ్చి నాతో గొడవపడేది అలాంటిది ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నారు అని అనుకుంటూ అయినా ఆవిడ గొడవ పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని అసలు ఎందుకు పిలిచిందో ఏంటో వెళ్తేనే కదా తెలిసేది అని భవానీ దేవి వాళ్ళు పిలిచిన ప్రదేశానికి వెళ్తాడు అక్కడికి వెళ్లేసరికి అందరూ అక్కడే ఉంటారు ఇక భవానీ దేవిని చూసి ఏంటి రమ్మన్నారు అంటే నీ బాధ్యతలు మీకు గుర్తు చేద్దామని అంటుంది అనుకున్నాను మీరు నాతో గొడవ పడడానికే పిలిచారని అనుకున్నాను అని శ్రీనివాస్ భవానితో కోపంగా మాట్లాడుతాడు పక్కనే ఉన్న మీరా అయ్యో నాన్న వాళ్ళు ఎందుకు పిలిచారు పూర్తిగా విను నువ్వు ఆవేశంతో వాళ్లతో గొడవ పడొద్దు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మేము మీతో గొడవ పడడానికి రాలేదు అని అంటాడు మరి గొడవపడడానికి కాకపోతే ఎందుకు పిలిచారు మురారిని ఎందుకు అరెస్ట్ చేయించాను అడగడానికి పిలిచారా నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి నా కూతురు చనిపోయిన బాధలో నేను ఆరోజు అలా చేశానునా ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలానే చేస్తారు అని అంటే వెంటనే భవాని దేవి నీ ప్లేస్ లోకి వచ్చి ఆలోచించాం కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రమ్మన్నాను అని అంటుంది. అందుకు అర్ధాన కానట్టు చూస్తాడు శ్రీనివాస్ ఇక వెంటనే భవాని దేవి
ఈరోజు మీ ముకుందా పిండా ప్రధానం అందుకే మిమ్మల్ని రమ్మన్నాను మీరు కూర్చొని పిండ ప్రదానం చేయండి అని అంటుంది. అందుకు శ్రీనివాస్ ఒప్పుకోడు భవానీ దేవి రేవతి ఎంత చెప్పినా కానీ వినడు ఇక చివరికి చేసేదేం లేక శ్రీనివాస నా కూతురు బతికే ఉంది నేను పెండ ప్రధానం చేయను అని కోపంలో ఆవేశంగా అనేస్తాడు. ఇక భవానీ దేవి అందరూ షాక్ అవుతారు ఇదేంటి ముకుంద బతికే ఉందని అంటున్నాడు అని ఇక అక్కడే ఉన్న మీరా ఎక్కడ తన గురించి నిజం మొత్తం బయటికి తెలిసిపోతుంది అని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అవును ముకుంద బతికే ఉంది మన మనసులో బతికే ఉంది మన ఆలోచనలో బతికే ఉంది. అలా అదే కదా అంకుల్ మీరు చెప్తుంది అని శ్రీనివాసుని అంకుల్ అంటూ పిలుస్తూ అందరి ముందు మాట్లాడుతుంది మీరా. ఇక్కడ ఓవరాక్షన్ చేయకుండా నువ్వు వాళ్ళు చెప్పింది చేసి ఆ పిండ ప్రధాన ఏదో కార్యక్రమం చేసేసి వెళ్ళు నాన్న నువ్వు అనవసరంగా నాకు లేనిపోని భయాలు పెట్టొద్దు అని శ్రీనివాస్ చేత దగ్గర ఉండి పిండ ప్రదానం చేయిస్తుంది. ఇక ముకుంద చేస్తున్న పనులు చూసిశ్రీనివాస్ కి చాలా కోపం వస్తుంది నువ్వు బతికుండగానే నా చేత ఇలా చేయిస్తున్నావు కదా నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని అంటాడు. పంతులుగారు అక్కడ పెట్టిన పిండాలు కాకి తినలేదు అని అంటాడు ముకుందని తిట్టడం మొదలుపెడతారు.
మళ్లీ ఇప్పుడు పరిష్కారం ఏదైనా చెప్పండి అని భవాని దేవి అడగడంతో ఆ పిండాలు తీసుకెళ్లి నీళ్లలో కలిపి రండి అని అంటే శ్రీనివాస్ వెళ్లి నీళ్లలో కలిపి వస్తాడు. ఇక తర్వాత బాధపడతాడు. మీరా కూడా బాధపడుతుంది. శ్రీనివాసు మీరా మీదా కోప్పడతాడు. కానీ ముకుంద మాత్రం ఏదో ఒకటి చెప్పండి నాన్న ఇప్పుడు నేను బాధపడుతుంటే మీరేం మాట్లాడకపోతే వాళ్లకు డౌట్ వస్తుంది అని చివరికితన తండ్రి చేత తానే ఓదార్పు కోరుకుంటుంది. ఇంక శ్రీనివాస్ ఏం చెప్పాలో తెలీక అమ్మ మీరా నువ్వు నా కూతురు లాంటి దానివే తను లేదని నేను ఇక బాధపడను. ఇక తనని నీలో చూసుకుంటాను అని అక్కడ చెప్పేసి వెళ్లిపోతాడు ఈ డైలాగ్ చాలా నాన్న నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అయింది బలే ఐడియా ఇచ్చావు అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇక ఇంటికి వచ్చేటప్పటికి ఆదర్శ కృష్ణ మురారి అందరూ ఉంటారు ఇక మిగిలిన వాళ్ళు పిండ ప్రధానం అయిపోయింది శ్రీనివాస్ చేత చేయించాము అని ఒక కాకి కూడా రాలేదు తను బతికున్నప్పుడు ఏదైనా మంచి పని చేస్తేనే కదా రావడానికి అని అంటారు ఇక వెంటనే మీరా ఏడుస్తూ ఉంటుంది. భవానీ దేవి కొంతకాలం వాలా జ్ఞాపకాలు ఆ మనుషుల పేర్లు ఇంట్లో వినపడుతూ ఉంటే అంతే బాధగా ఉంటుంది కొంతకాలం తర్వాత ఆ పేరు మనం మర్చిపోతాంలే అని అంటుంది. ఇక మీరా ఏడుస్తున్నట్టు ఆక్ట్ చేయడం ఎక్కువ చేస్తుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో మీరా ఏడుస్తూ ఉంటే ఆదర్శ అక్కడికి వచ్చి ఇకమీదట ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు అని ముకుంద ఫోటోకి దండ తీసేసి, ఇక ఈరోజు నుంచి మీరాని మనం ముకుందా అని పిలుస్తున్నాము తనే ఇకమీదట ముకుందా అని అంటాడు ఆ మాటకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ముకుందా అనుకుంది కూడా అదే మెల్లిగా తనని ఎక్కడ మర్చిపోతారు అని తన పేరు తనే కావాలని మార్చేలా చేస్తుంది.