Madhuranagarilo April 18 2024 Episode: నువ్వు నా సొంతం కావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా పండు ఆరోగ్య సమస్య నా కోసమే వచ్చినట్టుంది అందుకే మళ్ళీ నువ్వు నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్నావ్ ఇవన్నీ నీకు ఇష్టమన వండించాను శ్యామ్ నీకు ప్రేమగా భోజనం పెట్టి ఏన్నాళ్లయింది కడుపునిండా తిను అని రుక్మిణి అంటుంది. నువ్వు ఉద్యోగం కోసం వెళితే అక్కడ ఉద్యోగం దొరకకుండా నేనే ఫోన్ చేసి చెప్పాను ఆ రాధ మ్యారేజ్ బ్యూరో మూత పడిపోతే రాదా వెళ్లిపోతుంది అప్పుడు మళ్లీ నువ్వు నా దగ్గరికి వస్తావు మనం కలిసి ఉంటాం అనుకున్నాను కానీ ఆ రాధ వెళ్లిపోలేదు నువ్వు నా దగ్గరికి రాలేదు ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి పండు ఆరోగ్య పరిస్థితిని తీసుకువచ్చి నిన్ను నన్ను ఒకటి చేశాడు మళ్లీ మనం ఇద్దరం భార్యాభర్తలం అయ్యాం శ్యామ్ నాకు చాలా సంతోషంగా ఉంది అని రుక్మిణి అంటుంది.
శ్యామ్ కోపంతో పిడికిలి బిగించి పైకి లేస్తాడు. ఏమైంది శ్యామ్ నీ కోసమని ఇష్టమైనవన్నీ వండించాను తిను అని రుక్మిణి అంటుంది. నన్ను సొంతం చేసుకోవడం కోసం ఎన్ని కుట్రలు చేసావో విన్నాక నా కడుపు నిండిపోయింది అంటూ శ్యామ్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, శ్యామ్ అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ నా అకౌంట్ లో డబ్బులు వేశారాని అబద్ధం ఎందుకు చెప్పాడు అసలు ఏం జరిగింది శ్యామ్ కి కాంత డబ్బు ఎవరిచ్చారు అని కిరణ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్యామ్ అక్కడికి వస్తాడు. నీ గురించే ఆలోచిస్తున్నాను రా అమెరికాలో ఉన్న మన ఫ్రెండ్స్ నా అకౌంట్ లోకి డబ్బులు వేశారని అబద్దం ఎందుకు చెప్పావు రా అసలు ఆ డబ్బు ఎవరిచ్చారు అని కిరణ్ అడుగుతాడు. ఇంకెవరురా ఆ రుక్మిణి ఇచ్చింది అనిశ్యామ్ అంటాడు.
తను నీకు అంత డబ్బు ఇచ్చిందంటే ఏదో స్వార్థం తోటే ఇచ్చి ఉంటుందిరా అని కిరణ్ అంటాడు. ఏ స్వార్ధము లేకుండా తను డబ్బు ఎందుకు ఇస్తుంది రా నన్ను నేను తాకట్టు పెట్టుకుంటే డబ్బు ఇచ్చింది అని శ్యామ్ అంటాడు. నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకోవడమేంట్రా అసలు ఏం జరిగింది అని కిరణ్ అడుగుతాడు. శ్యామ్ జరిగిన విషయం అంత చెబుతాడు. ఏంటి నీ అవసరాన్ని అవకాశంగా వాడుకొని తాళి తాళి కట్టించుకుందా తప్పు చేశావురా శ్యామ్ అలా చేయకుండా ఉండాల్సింది రాధకు ద్రోహం చేశావురా అని కిరణ్ అంటాడు. అలా చేయకపోతే పండు బ్రతికేవాడు కాదు రాధకు ద్రోహం చేసే వాణ్ణి ఒక రాదా కు కాదురా మా అమ్మకి నాన్నకి నాకు నేను కూడా ద్రోహం చేసుకునే వాని అని శ్యామ్ బాధపడతాడు. ఈ విషయం రాదకి చెప్పలేక అమ్మానాన్నలకి చెప్పలేక బాధపడుతున్నాను ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో ఏమో అని శ్యామ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
కట్ చేస్తే,రాధా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి అమ్మ నీ దయవల్ల పండు ఆరోగ్యం కుదుటపడింది పండు జీవితాంతం అలాగే ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వదించు అని దండం పెట్టుకుంటుంది. అక్కడ ఒక ఆవిడ మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకుంటుండగా చూసి తన తాళిని తీసుకొని ఇది ఆయన నా కోసం ఎంతో కష్టపడి తెచ్చాడు అని ఆరోజు శ్యామ్ ఇచ్చిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది రాదా. కట్ చేస్తే, ఇంతలో మధుర రాధకి ఫోన్ చేస్తుంది. అమ్మ రాధ పండుని ఇంకొక అర్ధగంటలో డిశ్చార్జ్ చేస్తారు అంట ఎక్కడున్నావ్ అమ్మ అని అడుగుతుంది. ఇక్కడే ఊరి చివరన గుడిలో ఉన్నాను అత్తయ్య పది నిమిషాల్లో వచ్చేస్తాను అని రాదా అంటుంది. వద్దమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు మేము పండు ని తీసుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాం అని మధుర చెబుతుంది. కట్ చేస్తే, డాక్టర్ పండుని చూసి తన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు మెడిసిన్ రాసిస్తాను టైం టు టైం వాడండి అని శ్యామ్ కి చెబుతుంది డాక్టర్. రాధా గుడిలో అమ్మవారి ప్రసాదం తీసుకోబోతూ ఉండగా కింద పడిపోతుంది.
ఏదో అరిష్టం జరగబోతుంది అమ్మ అమ్మవారి ప్రసాదం కింద పడటం ఏంటి జాగ్రత్తగా ఉండు అని పంతులుగారు చెబుతారు.శ్యామ్ మెడిసిన్ తీసుకొని వస్తూ ఉండగా ఇంతలో ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ టైం లో ఫోన్ చేశావు అని శ్యామ్ అంటాడు. పండుని డిశ్చార్జ్ చేస్తున్నారంట కదా నేను హాస్పిటల్ కి వస్తాను అని రుక్మిణి అంటుంది. నువ్వు హాస్పిటల్ కి ఎందుకు అవసరం లేదు పండుని రీఛార్జ్ చేయక ఇంటికి తీసుకొని వెళ్తున్నాను అని శ్యామ్ అంటాడు. ఇంకొక 45 నిమిషాల్లో పండుని తీసుకొని ఇంటికి వస్తే ముగ్గురం కలిసి ఆనందంగా ఉంటాం లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని రుక్మిణి అంటుంది. ఏం చేయాలో అర్థం కాక శ్యామ్ సతమతమై పోతూ ఉంటాడు శ్యామ్ . కట్ చేస్తే, రాధా ఇంటికి వెళదామని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఆటో ఆపుతూ ఉండగా ఒక్క ఆటో కూడా ఆగకపోవడంతో రాద నడుచుకుంటూ వస్తుంది. దారిలో ఒకతను రాధ మెడలో ఉన్న పుస్తెను చూసి నీకు ఆటో కావాలా మేడం రండి నా దగ్గర ఆటో
ఉంది అని తీసుకువెళ్తూ కొద్ది దూరం వెళ్ళగానే తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగేసుకొని పారిపోతూ ఉంటాడు. దొంగ పట్టుకోండి అంటూ రాధా అతని వెనకాల పరుగెత్తుతుంది. కట్ చేస్తే, అతను పరిగెత్తి విరాజ్ కారుకు అడ్డం పడతాడు. ఏ చావడానికి నా కారు దొరికిందా నీకేమీ కాలేదు కదా అని విరాజ్ అంటాడు. ఇంతలో రాధ అతని వదిలి పెట్టకండి అంటూ వస్తూ ఉండగా ఆవిడ మా ఆవిడ సార్ బ్యూటీ పార్లర్ తీసుకెళ్లమని నన్ను ఇబ్బంది పెడుతుంది నన్ను వదిలేయండి సార్ ఏ గుడి దగ్గరికి అయినా వెళ్లి బిచ్చం మెతుకుంటాను పెళ్లి బుద్ధి తక్కువయ్ చేసుకున్నాను అని అంటాడు. పెళ్లి బుద్ధి తక్కువయ్ చేసుకున్నాను అంటున్నావు కాబట్టి నువ్వు నాకు నచ్చావ్ రా అని విరాజ్ అతనికి డబ్బులు ఇచ్చి పారిపోమ్మని చెబుతాడు. రాధ అక్కడికి పరిగెత్తుకొచ్చి వాడిని ఎందుకు వదిలేశారు సార్ అని అంటుంది. అదేంటి భర్తని పట్టుకొని వాడు వీడు అంటున్నావ్ అని విరాజ్ అంటాడు. వాడు నా భర్త ఏంటి సార్ నాన్సెన్స్ వాడొక దొంగ అని రాధా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది