Mahima Nambiar: ప్రస్తుతం వెండితెరపై కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు నటనకు గ్లామర్ సంబంధం లేదు. కానీ ఇప్పుడు అందంతో పాటు నటన, అణుకువ ముఖ్యం. ఎప్పటికప్పుడు యువ నటీమణులు ఇండస్ట్రీలో తళుకుమంటున్నారు. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని వెండి తెరపై చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ ఒకరు. 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ మూవీస్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఇంతకీ మహిమా నంబియార్ ఎవరు? ఆమె ఎక్కడ పుట్టింది? ఆమె ఇప్పటివరకు నటించిన సినిమాలు? తదితర విషయాలకు సంబంధించిన వివరాలను ఈ రోజు తెలుసుకుందాం..
మహిమా నంబియార్ వ్యక్తిగతం.. సినీ ప్రస్థానం..
1994 డిసెంబర్ 21న కేరళలోని కాసర్గోడ్లో మహిమా నంబియార్ జన్మించారు. ప్రస్తుతం ఈమె వయసు 29 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి మహిమాకు నటనపై ఆసక్తి ఎక్కువ. అందుకే తన 15వ యేటా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో ‘కార్యస్థానం’ సినిమాతో మళయాళంలో అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఆమె వరుస అవకాశాలు మొదలయ్యాయి. 2012లో ‘సాట్టై’ సినిమాలో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో తమిళంలో మహిమా నంబియార్కు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ‘ఎన్నమో నడకదు, మోసకుట్టి, అగతినై, క్రైమ్ 23, పురియత పుతిర్, అన్నాదురై, కోడివీరన్, ఇరవుక్కు అయిరమ్ కనగల్, అన్నానుక్కు జై, మగముని, అసురగురువు, ఓ మై డాగ్’ వంటి తమిళ సినిమాల్లో నటించారు. ‘మాస్టర్ పీస్, మధు రాజా’ వంటి మలయాళ సినిమాల్లో నటించారు.
చంద్రముఖి-2లో కీలక పాత్రలో..
మహిమా నంబియార్ ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్గా మారిపోయారు. రీసెంట్గా ఆమె మలయాళంలో నటించిన వలెట్టా, ఆర్డీఎక్స్ సినిమా భారీ హిట్స్ అందుకున్నాయి. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. పీ.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ‘చంద్రముఖి-2’లో ఈ అమ్మడు జాక్పాట్ కొట్టింది. చంద్రముఖి సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. కమర్షియల్ హిట్ అందుకున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ తన యాక్టింగ్తో ప్రేక్షకులను మెప్పించింది.
అదే విధంగా విజయ్ ఆంటోని సరసన నటించిన ‘రత్తం’, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్గా తెరకెక్కిన ‘800’ సినిమాలో విడుదలయ్యాయి. అక్టోబర్ 6న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘800’ చిత్రంలో ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ తనకు చాలా ప్రత్యేకమైనదని ఆమె పలు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువే..
సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ మల్లు కుట్టి తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. మహిమాకు ఇన్స్టాగ్రామ్లో 1.1 మిలియన్ల ఫాలొవర్స్ ఉన్నారు. ఇందులో ఆమె తన ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తుంటారు. వీటికి లక్షల్లో వ్యూవ్స్ వస్తుంటాయి. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ యువతను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ముద్దబంతిలా కనిపిస్తూ మత్తెక్కించే అందం..
మహిమా నంబియార్ తాజాగా తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో ఎల్లో సారీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ముద్దబంతిలా కనిపించే ఈ మల్లు భామ.. చీరకట్టూలో దేవతలా కనిపిస్తోంది. చీరకట్టులో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేవలోకం నుంచి దిగొచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది. కైపెక్కించే చూపులతో, తన అందాలతో యువతను కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. చీరకట్టుతోపాటు మోడ్రన్ డ్రెస్సుల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుంది. వీటికి లక్షల్లో వ్యూవ్స్ వస్తున్నాయి.