Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కావాల్సింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సినిమా ఈ వేసవికి విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ జరగడంతో పాటు కొన్ని రోజులపాటు వైద్యుల విశ్రాంతి నియమించడంతో “దేవర” మూవీ లెక్కలు మొత్తం తారుమారయ్యాయి.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. ఈ పాత్ర కోసం మరాఠీ హీరోయిన్ శృతి మరాటేకి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఈ ముద్దుగుమ్మ “దేవర” తోనే టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. “దేవర” మొదటి భాగంకి సంబంధించి 80 శాతం షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్న సమయంలో.. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైములో.. విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయాలు పాలు కావటం సినిమా రిలీజ్ కి బ్రేక్ లు పడ్డాయి. దీంతో ఇప్పుడు మరో కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. “RRR” వంటి బిగ్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ “దేవర” హాలీవుడ్ సినిమాకి మంచి ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలకి కీలక వ్యాఖ్యలు చేశారు. “గేమ్ ఆఫ్ త్రోన్స్” కంటే ఈ సినిమాలో ఉండే వాటర్ సీక్వెన్స్ ఇండియాలో ఇప్పటివరకు ఎవరు చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా జాహ్నవి కపూర్ నటిస్తోంది. “దేవర” తోనే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అది కూడా తెలుగులో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తూ ఉండటంతో సినిమాకి ఇది ఒక ప్లస్ పాయింట్ గా మారింది.