Trinayani April 17 2024 Episode 1215: అమ్మగారు అమ్మవారికి దక్షిణగా ఇస్తే మళ్లీ మనం చూసే అదృష్టానికి కలిగించింది విశాలాక్షమ్మె అని ఎదులయ్య అంటాడు. మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి అవి కనపడ్డాయి అని పవను మూర్తి అంటాడు. పాపపుణ్యాలు పక్కన పెట్టండి ముందు తన మెడలో ఉన్న వజ్రాల పుస్తెలు తీసుకువమను అని తిలోత్తమ అంటుంది. అమ్మ ఒక్కసారి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆశపడకూడదు అని విశాల్ అంటాడు. అరే అందుకని తనకి ఇచ్చేస్తారా అని వాళ్ళు అంటాడు. ఇది నాది కాబట్టే నా దగ్గర ఉంది అని విశాలాక్షి అంటుంది. చూడు జాలి పడితే మనది పోయి తనదంటుంది అని తిలోత్తమ అంటుంది. చిన్నపిల్ల ఏదో ముచ్చటపడి యేసుకు వచ్చింది అని హాసిని అంటుంది. చిన్నపిల్ల తాళిబొట్టు మెడలో వేసుకోవడం ఏంటే అని దూరంగా అంటుంది. ఏ ముందు ఆ తాళి ఇచ్చే అని తిలోత్తమా తన దగ్గరికి వెళ్తుంది.
ఎందుకు ఇవ్వాలి అని విశాలాక్షి అంటుంది. మాది కాబట్టి అని తిలోత్తమ అంటుంది. ఇది నాది కాబట్టే నా మెడలోకి వచ్చింది అని విశాలాక్షి అనడంతో తిలోత్తమా విశాలాక్షి మెడలో ఉన్న పుస్తెలతాడును పట్టుకుంటుంది. వెంటనే తిలోత్తమ మెడలో తాళి ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది నా తాలిని పట్టుకునిది ఎవరు అని తిలోత్తమ అంటుంది. నీ చావు అని విశాలాక్షి అంటుంది. మీరు విశాలాక్షి మెడలో తాళి వదలకపోతే గాయత్రి కూడా నీ మెడలో తాళి వదిలేలా లేదు అత్తయ్య అని నైని అంటుంది. భయంతో తిలోత్తమా తాళిని వదిలేస్తుంది. గాయత్రి పాప కూడా తన మెడలో ఉన్న తాళి వదిలేస్తుంది. దీన్నిబట్టి నీకేం అర్థమైంది అత్తయ్య అని హాసిని అంటుంది. నైని నా మెడలో ఉన్న తాళిబొట్టును పాపకి ఇచ్చి బెదిరించింది నైని అని తిలోత్తమ అంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి విశాలాక్షికి ఆ తాళిబొట్టును ఎవరిచ్చారు అడగండి అని దూరందర అంటుంది.
చెప్పు విశాలాక్షి ఆ తాళిబొట్టును ఎవరిచ్చారు అని నైని అంటుంది. వద్దమ్మా ఇబ్బంది పడతారు అని విశాలాక్షి అంటుంది. ఎవరం ఇబ్బంది పడము ముందు ఎవరిచ్చారు చెప్పు అని సుమన అంటుంది. విశాలాక్షి ఎవరిచ్చారో చెప్పమ్మా అని విశాల్ అంటాడు. చెప్పమంటావా నాన్న అని విశాలాక్షి గాయత్రీ దేవి ఇచ్చింది అని చెబుతుంది. ఆ మాట విన్న వల్లభ పకపకా నవ్వుతాడు. ఆపండి ఎందుకలా నవ్వుతున్నారు అని హాసిని అంటుంది. ఈ పాప చెప్పేది వింటుంటే తనకి 50 సంవత్సరాలు పైన ఉంటాయి ఎందుకంటే గాయత్రి పెద్దమ్మ చనిపోక ముందు ఇచ్చింది కదా అని వల్లభ అంటాడు. నువ్వు నోరు ముయ్యరా చెప్తాను పదా అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. విశాలాక్షి పాపా గాయత్రి పెద్దమ్మ వంక ఎందుకు చూపించావు అని విక్రాంత్ అంటాడు, తనే ఇచ్చింది కాబట్టి చూపించాను అని విశాలాక్షి అంటుంది.
విశాలాక్షి అందరూ నిను ప్రశ్నలతో ముంచెత్తుతారు నీకు టిఫిన్ పెడతాను రా అని నైని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ సుమన అని విక్రాంత్ అంటాడు. అసలు నన్ను ఎందుకు బతికించారు అండి అని సుమన అడుగుతుంది. నలుగురి బిడ్డల్ని కన్నా సాదడానికి తల్లుండాలి అందుకే బ్రతికించాను అని విక్రాంత్ అంటాడు. నేను చనిపోయిన నా బిడ్డ అయినా కోట్లలో మునిగి తేలేది కదా అప్పుడు స్వర్గం నుంచి నిన్ను చూసి ఆనందించేదాన్ని అని సుమన అంటుంది. నువ్వు బ్రతికుంటే చాలు అనుకున్నాను సుమన అందుకే బ్రతికించాను అని విక్రాంత్ అంటాడు. నా బిడ్డ బ్రతికుంటే కోట్లు వచేవి కదా అండి అని సుమన అంటుంది. కోట్ల కన్నా నువ్వు బ్రతికుంటే చాలు అనుకున్నాను సుమన అని విక్రాంత్ అంటాడు. గాయత్రి అత్తయ్య మా అక్కకి కోట్ల ఆస్తిని ఇచ్చింది నాకు ఏముంది చూసుకొని మురవడానికి అని సుమన అంటుంది. నీ దగ్గర కోట్లు విలువ చేసె నగలు ఉన్నాయి కదా అవి వేసుకుని ఊరేగు అని విక్రాంత్ అంటాడు. మా అక్క దగ్గర అంతకుమించి ఉన్నాయి అని సుమన అంటుంది.
నువ్వు ఉన్నదానితో తృప్తి పడవు నువ్వు బాగుపడవు అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,నైని గాయత్రి పాపకి పాలు పట్టిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పాపకి పూలమారుతుంది నైని అని విశాల్ అంటాడు. పాపకి నేను పాలు పట్టిస్తాను అని హాసిని గాయత్రి పాపకు పాలు పట్టిస్తుంది. బాబు గారు గాయత్రి పాపా తిలోత్తమ అత్తయ్య మేడలో తాళిని అంత గట్టిగా ఎలా పట్టుకుంది ఆలోచిస్తుంటే నిజం తెలిసేలా ఉంది అని నైని అంటుంది. మనకు పనులు ఉన్నాయి కదా పదండి అని హాసిని అంటుంది. అవును నాకు చాలా పెద్ద పని ఉంది నీకు కూడా పని ఉంది కదా అల్లుడు పదా అని పావనమూర్తి అంటాడు.ఏమి చెప్పకుండా దాటేసి వెళ్ళిపోతున్నారేంటి ఆగండి సమాధానం చెప్పండి అని నైని అంటుంది. నైని నువ్వు కోపం తెచ్చుకోకపోతే నిజంగానే పనులు ఉంటాయి కదా చేసుకోవాలి అని విశాల్ అంటాడు. గాయత్రి పాపా బొద్దుగా బలంగా ఉంది కాబట్టి చంపేయాలని చూసిందేమో అని హాసిని అంటుంది.వదిన నువ్వు నోరు జారి అందర్నీ కంగారు పెట్టకు నైనికి ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అని విశాల్ అంటాడు. నాకు బోలెడన్ని పనులు ఉన్నాయి అంటూ హాసిని వెళ్ళిపోతుంది. నైని అది సమాధానం లేని ప్రశ్న అంటూ విశాల్ వెళ్ళిపోతాడు.
మాట దాటేసి అందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు అని నైని అనుకుంటుంది.కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ విశాలాక్షి మెడలో ఉన్న వజ్రాల మంగళసూత్రాన్ని కొట్టేయడానికి వస్తారు. కత్తెర తీసుకొని కట్ చేయబోతూ ఉండగా ఇంతలో సుమన రాకని గమనించి సుమన వస్తుంది దాక్కుందాం పద అని తిలోత్తమ వల్లభ దాక్కుంటారు. సుమన పెద్ద కత్తి పట్టుకొని రావడం చూసి చిన్న మరదలు కత్తి పట్టుకొని వస్తుంది మమ్మీ అని వల్లభ అంటాడు. సుమన విశాలాక్షిని చంపేస్తుందేమో అని తిలోత్తమ అంటుంది. సుమన వచ్చి అమ్మాయా ఇక్కడ ఇప్పుడు ఎవరూ లేరు ఈ వజ్రాల తాళిని కట్ చేసి తీసుకువెళ్లి పోతే నా సొంతం అవుతుంది అని సుమన కత్తితో తాళిని కట్ చేయబోతూ ఉండగా గాయత్రీ పాప పూలకుండిని కింద పడేస్తుంది. ఎవరో వస్తున్నారు అంటూ సుమన వెళ్లి సోఫా వెనకాల దాకుంటుంది అక్కడ తిలోత్తమ్మ వల్లభ కనబడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది