NewsOrbit
Featured బిగ్ స్టోరీ

తమ్మినేని వ్యాఖ్యల వెనుక…కోర్టు తీర్పులను సమీక్షిస్తాం..!!

గతంలో రోజా వ్యవహారంలో కోడెల సైతం…

చట్టసభల నిర్ణయాల్లో జోక్యం తగదు..

ఏపీలో కొంత కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు బట్టాయి. కొన్నింటిని కొట్టివేసాయి. తాజాగా.. పాలనా వికేంద్రీకరణ బిల్లులపైన హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులు అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేసారు. చట్ట సభలు తీసుకున్న నిర్నయాలు..చేసిన చట్టాల పైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటం తగదని తమ్మినేని వ్యాఖ్యానించారు. కేంద్రం సైతం ఇదే విషయాన్ని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. ఇప్పడు తమ్మినేని సైతం ఇదే చెబుతున్నారు. కోర్టులు ఒక వేళ జోక్యం చేసుకొని తీర్పులు ఇస్తే తాము వాటిని సమీక్షిస్తామని చెబుతున్నారు. ఒక వ్యవస్థ నిర్ణయాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోరాదనే విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేసారు. దీంతో..ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారంలో కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేయటం…కోర్టుల తీర్పుపైన ఉత్కంఠ నడుమ ఇప్పుడు స్పీకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.

ANDHRA PRADESH, POLITICIS, TAMMINENI SITHRAM, HIGHCOURT, AMARAVATHI, JUDGEMENTS, YS JAGAN MOHAN REDDY, CHANDRA BABU NAIDU, CHIEF JUSTICE, JUSTICE, LAWYERS, TDP, YSRCP, JANASENA
ANDHRA PRADESH, POLITICIS, TAMMINENI SITHRAM, HIGHCOURT, AMARAVATHI, JUDGEMENTS, YS JAGAN MOHAN REDDY, CHANDRA BABU NAIDU, CHIEF JUSTICE, JUSTICE, LAWYERS, TDP, YSRCP, JANASENA

కేంద్రం అఫిడవిట్…స్పీకర్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం చట్టం చేసిన అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టాల పైన అమరావతి రైతులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. వీటి పైన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ హైకోర్టు చట్టాల అమలు పైన స్టేటస్ కో అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమారాతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు వ్యతిరేకిస్తున్న వారంతా న్యాయ స్థానాల్లో ఈ చట్టాలు నిలబడవనే ఆశతో ఉన్నారు. ఇక, శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లులను పంపాలనే నిర్ణయం అమలు కాలేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. ఇలా..ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక నిర్ణయాల పైన కోర్టుల్లో పిటీషన్లు పెండింగ్ లో ఉండటంతో..

ఈ వ్యవహారం ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో..స్పీకర్ తమ్మినేని ఇదే సమయంలో చేసిన వ్యాఖ్య లతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందనే ఉత్కంఠ మొదలైంది. కోర్టు తీర్పు ఇచ్చినా..తాము వాటిని సమీక్షిస్తామంటూ ఆయన మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో రిపోర్ట్ చేసారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటే కానప్పుడు పెండింగ్ లో ఎలా ఉంటుందని తమ్మినేని ప్రశ్నిస్తున్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపాలంటే ఖచ్చితంగా ఓటింగ్ జరగాల్సిన అవసం ఉందని..అయితే అది చోటు చేసుకోనప్పుడు సెలెక్ట్ కమిటీ అంశమే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు.

గతంలో కోడెల సైతం..రోజా విషయంలో

శాసనసభలో తీసుకున్న నిర్ణయాలు..శాసనసభ అధికారాలు..కోర్టుల జోక్యం అనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది. కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సైతం శాసనసభలో జరిగిన చర్చల పైన కోర్టులు జోక్యం చేసుకోలేవంటూ పేర్కొనటం ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే విషయం. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంోల కాల్ మనీ అంశం పైన సభలో చర్చకు వచ్చింది. ఆ సమయంలో విపక్ష సభ్యురాలిగా ఉన్న రోజా..నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీంతో..సభలో నాటి శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి తీర్మానం ప్రతిపాదించటం..స్పీకర్ స్థానం లో ఉన్న కోడెల మూడ్ ఆఫ్ ది హౌస్ గా తీర్మానం ఆమోదిస్తూ ఏకంగా రోజాను ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేసారు. దీన పైన రోజా న్యాయస్థానం ఆశ్రయించారు.

న్యాయస్థానం రోజా సస్పెన్షన్ పైన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా..దీనిని అమలు చేయాలా వద్దా అనే అంశం పైన సభలో స్పీకర్ చర్చ పెట్టారు. స్పీకర్ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవాలని నాటి టీడీపీ సభ్యులు సూచించారు. దీంతో..సభలో జరిగిన వ్యవహారం పైన కోర్టు ఆదేశాలను అమలు చేయమంటూ..రోజా ను సభలోని అనుమతికి నిరాకరించారు. కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకీ అనుమతించలేదు. ఇక, ఇప్పుడు తమ్మినేని చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే..రాబోయే రోజుల్లో ఏం జరుగే అవకాశం ఉందనే ఆసక్తి కర చర్చ అటు ప్రభుత్వంలో ..ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో చర్చ సాగుతోంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju