బాధంపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరం రోగాల బారి నుండి రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఉండాలి. అందుకే ప్రతిరోజు బాదం పప్పులను నానపెట్టుకుని తింటే రోగానిరోధక శక్తి అధికం అవుతుంది. బాదం పప్పులలో శరీరానికి కావల్సిన పోషకాలన్ని ఉంటాయి.బాదం పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్స్, మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.అయితే బాదం పప్పులను చాలా మంది నానపెట్టకుండా నేరుగా తింటూ ఉంటారు. నిజానికి అలా డైరెక్ట్ గా తినడం కంటే బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిపై ఉన్న పొట్టును తీసి తినడం వలన శరీరానికి చాలా రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
బాదం పప్పును పొట్టు తీసే ఎందుకు తినాలి.?
పొట్టుతో బాదం పప్పును ఎందుకు తినకూడదంటే బాదం పప్పు యొక్క పొట్టులో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బాదంలో ఉండే పోషకాలను పూర్తిగా మన శరీరానికి అందకుండా అడ్డుపడుతుంది.అలాగే బాదం పప్పులను పొట్టు తీసి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి. నానబెట్టిన బాదం పప్పులో లైపస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే బాదం గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
బాదం పప్పు యొక్క ఉపయోగాలు :
రోజూ క్రమం తప్పకుండా పొట్టు తీసిన బాదం పప్పును తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బాదంపప్పును ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది.బాదం పప్పును రోజూ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బాదాం పప్పులలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాదం గింజలు మనకు సహాయపడతాయి. బాదం గింజలను తినడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు, వృద్ధాప్య ఛాయలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.