మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది ముఖ్యం. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.
పండ్లను ను తరచూ తింటే సరిపోతుందా? లేదా పండ్లను తినడానికి కూడా సరైన పద్దతి ఉందా? భోజనం చేయగానే పండ్ల ను తినొచ్చా? ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత కాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల ఇది శరీరంలోని జీవక్రియలను డిటాక్స్ చేయడానికి చాలా సహాయపడుతుంది.
అంతే కాదు ఈ సమయంలో తీసుకొనే పండ్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాంశాలతో పాటు విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. ఐతే, అన్ని రకాల ఫ్రూట్స్ ను ఈ విధంగా తీసుకోకూడదు. వాటర్ మెలన్, బ్లూ బెర్రీస్, కివి, బొప్పాయి మరియు దానిమ్మ వంటివాటిని మాత్రమే ఉదయాన్నే తినవచ్చు.
సిట్రిక్ ఫ్రూట్స్ ను పరగడుపుతో తినకూడదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా శరీరంలోని తక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్ ను నిదానంగా పెంచడానికి సహాయపడుతుంది.
అలాగే, భోజనం చేసిన వెంటనే పండు తినడం కూడా మంచిఆలోచన కాదు. ఇది సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. పోషకాలు కూడా అందవు.భోజనానికి అలాగే పండ్లు తినడానికి కి మధ్య కాస్తంత గ్యాప్ ఉండాలి. భోజనానికి గంట ముందు ఫ్రూట్ తినాలి. భోజనం అయిన రెండు గంటల తరువాత ఫ్రూట్ తినాలి. షుగర్ అలాగేజీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ దూరం పాటించాలి.కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్పితే మాములుగా గా ఐతే పళ్ళ రసాలకంటే పండ్లని తినడమే మేలు.
సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వండి.