రోజు ఒకటే రకం ఫుడ్ తింటుంటే కూడా తినబుద్ధి కాదు. అందులో ఇడ్లీ చాలామందికి అస్సలు నచ్చని టిఫిన్ …కానీ ఒక హోటల్ మాత్రం సంవత్సరాలు తరబడి ఒకే వంటకాన్ని చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే జనాలు కూడా ఆ ఒక్క టిఫిన్ తినడం కోసం హోటల్ కి వెళ్తున్నారు…
విజయవాడలో ఎస్ ఎస్ ఎస్ అనే హోటల్ చాలామంది కితెలిసే ఉంటుంది. ఈ హోటల్ ని ఎస్ ఎస్ ఎస్ ఇడ్లీ హోటల్ అని కూడా అంటారు. దాదాపు గా 40 సంవత్సరాల నుండి ఈ హోటల్ లో ఒకటే టిఫిన్ తయారవుతోందట.ఆ టిఫిన్ ఏంటోఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. హోటల్ పేరు చూస్తే ఈ పాటికి మీకే అర్థం అయిపోయి ఉంటుంది. 40 సంవత్సరాల నుండి ఈ హోటల్ లో ఇడ్లీ తప్ప వేరే ఏ పదార్దాలని తయారు చేయట్లేదు. ఇంక ఈ హోటల్ లో తయారు చేసిన ఇడ్లీ చాలా ఫేమస్ అట.
విజయవాడ లో నివసించే వారే కాకుండా పని మీద వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఈ హోటల్ లో ఇడ్లీ ఖచ్చితంగా రుచి చూస్తారట. ఒక ఇడ్లీ 15 రూపాయలు ఉంటుందట.
ఇడ్లీ తో పాటు నెయ్యి, అల్లం చట్నీ, పల్లి చట్నీ ఇస్తారట. ఈ హోటల్ సోమవారం నుండి శనివారం వరకు పొద్దున 6:00 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 9:30 వరకు ఉంటుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
విజయవాడ లో నివసించే వాళ్ళు కచ్చితంగా ఈ హోటల్ కి ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. ఒకవేళ వెళ్లకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళండి. మీరు ఒకవేళ వేరే ప్రాంతం వాళ్ళు అయితే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే ఈ హోటల్ ఇడ్లీ తప్పకుండా రుచి చూసి ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి .