Uttarakhand : ఉత్తరాఖండ్ Uttarakhand రాష్ట్రంలో ఒకే సారి విరుచుకుపడిన వరద ప్రళయం వెనుక ఎంతో కథ ఉందని, అది కేవలం మానవ తప్పిదం వల్ల జరిగినదే అంటూ బయటకు వస్తున్న కొన్ని ప్రచారాలు కలవరపెడుతున్నాయి. దేశ భద్రతా వ్యవహారాలు దానిలో బయటకు రావడం విశేషం. అంతేకాదు ఉత్తరాఖండ్ వరదల వెనుక చైనాతో అమెరికా కయ్యం, చైనాను ఎదుర్కునేందుకు భారత్ సాయపడిన తీరు గతంలో జరిగిన అన్ని విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చరిత్రలో మరుగున పడిపోయిన మరుగున పడేసిన ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు ఈ వరదల వల్ల కొందరు గుర్తు చేస్తున్నారు. వాటిని వింటే ఈ వరదల వెనుక కేవలం చిన్న విషయం లేదని చాలా పెద్ద విషయమే ఉందని తేటతెల్లమవుతుంది.
uttarakhand నంద దేవి పర్వతం మీద ఏం జరిగింది??
ఉత్తరాఖండ్ లో బీభత్సంగా వచ్చిన వరదలకు ప్రధానంగా నందా దేవి పర్వతాల మీద ఉన్న మంజు చరియలు విరిగి పడడం ఏ ప్రధాన కారణం అని భావిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడడంతో దానికి అనుసంధానంగా ఉన్న నదులు ఒక్కసారిగా నీటి ప్రవాహం వేగం పుంజుకొని వరదల గా మారాయి. అసలు ఇంత అత్యవసరంగా నదుల్లో ప్రవాహం పెరగడం వెనుక నందాదేవి పర్వతం మీద మంచు చరియలు విరిగి పడటం వెనుక ఎంతో ఉందని అది దేశ భద్రతకు సంబంధించిన అధికారులు చెబుతున్నారు.
అదే ఆపరేషన్ హ్యాక్ట్
1964లో చైనా తొలిసారి అణుధార్మిక పరీక్షలు నిర్వహించింది. అత్యంత భారీగా తన అనుభవాన్ని ప్రపంచానికి చాటే విధంగా అన్ని పరీక్షలనూ చైనా చేసింది. దీంతో కలవరపాటుకు గురైన అమెరికా చైనా మీద నిఘా ఉంచడానికి భారత్ సాయం కోరింది. 1965లో అమెరికా సీఏఏ భారత ఐబీ సహాయం కోరింది. దీనిలో భాగంగా చైనాకు దగ్గరగా ఉండే నందాదేవి పర్వతాన్ని స్థావరం గా మలుచుకున్నారు. దీంతో పర్వతంపైన సెన్సార్లు పెట్టాలని దానికి సంబంధించిన సరంజామా మొత్తం పర్వతం మీదకు అమెరికా చేర్చింది. దాంట్లో ఎక్విప్మెంట్ ని ప్లుటోనియం క్యాప్సల్ని అక్కడికి తీసుకు వెళ్లారు. అయితే అప్పటికి పర్వతం మీద వాతావరణం అనుకూలించక పోవడంతో ఆ కార్యక్రమాన్ని పరికరాలు అక్కడ పెట్టేసి కిందికి వచ్చేసారు. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ పర్వతం మీదికి వెళ్లి ఎందుకు వాతావరణం సహకరించడంతో పైకి వెళ్లి చూడగా అణుధార్మికత తో కూడిన కాప్సల్స్, కొన్ని కీలకమైన జనరేటర్లు పరికరాలు కనిపించలేదు. అవి వాతావరణంలో కలిసిపోయి ఎటో వెళ్ళి పోయాయి. అదృశ్యమైన వీటికోసం తర్వాత కాలంలో వరుసగా ఐదు సంవత్సరాల పాటు వెతికినా వీటి జాడ లేదు.
మన్మోహన్ కోహ్లీ చెప్పిందే ఇది…
అప్పటి అమెరికా అధికారులు తో కలిసి నిర్వహించిన ఆపరేషన్ హ్యాక్ట్ లో పనిచేసిన ఐబీ అధికారి మన్మోహన్ కోహ్లీ తాజాగా ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో స్పందించారు. 1965లో మిస్సయిన ఫ్లూటోనీయం కాప్సల్స్ వందేళ్ల పాటు సజీవంగా తన ప్రభావాన్ని చూపగలదని, నందాదేవి పర్వతశ్రేణుల్లో అదృశ్యమైన ఈ భయానక క్యాప్సిల్స్ వల్లనే అక్కడ విపరీతమైన చర్యలు జరుగుతున్నాయని కోహ్లీ అనుమానిస్తున్నారు. దీనిపై ఆయన భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసి నందాదేవి పర్వతాన్ని పైకి ఖచ్చితంగా పరిశోధనలు చేయాలని కోరారు. గతంలోనూ ఉత్తరాఖండ్లో అప్పటికప్పుడు వచ్చిన వరదలు వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. దీనికి కూడా పర్వతాల్లో జరిగినా కొన్ని హనుమాన్ అద్భుతంగా ఉన్న చర్యలే కారణమని భావించారు.
కరిగితే డేంజర్!
నందాదేవి పర్వత శ్రేణుల్లో మిస్సయిన ప్లుటోనియం అత్యంత ప్రమాదకరమైంది. ఇది పర్వత శ్రేణుల్లో నుంచి మంచిర్యాల గుండా మొత్తం తర్వాత గంగా నదిలోకి కలిస్తే చాలావరకూ ప్రమాదం అవుతుంది. ఇది ఉత్తర ప్రదేశ్ బీహార్ ల తో పాటు ఇటు పశ్చిమబెంగాల్ కూడా పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై గతంలోనే మోడీ ప్రభుత్వం పరిశోధనలు చేసి ఆ పరికరాల జాడ కనిపెడతామని చెప్పింది. అయితే ఇప్పటికీ ఎలాంటి పరిశోధనలు జరగలేదు. ఇప్పటికైనా స్పందించి పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి భయాలు ఉండవు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ వరదలకు కచ్చితంగా ఆపరేషన్ హ్యాక్ట్ కారణం అని చెప్పలేం గానీ ప్రతిసారి ఉత్తరాఖండ్ వరదలు వస్తే ఆ సంఘటన గుర్తుకు వస్తోందని అప్పటి సైనిక అధికారులు చెప్పడం విశేషం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?