Radhey Shyam: “బాహుబలి” విజయం తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు ఇండియాలో ఏ హీరోకి లేని విధంగా ఉంది. దేశ విదేశాలలో.. ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. దీంతో డార్లింగ్ తో సినిమా చేయాలంటే మినిమం బడ్జెట్ వందల కోట్ల లో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లు… దర్శకులు ప్రభాస్ తో ఒక సినిమా చేస్తే చాలు అన్న తరహాలో ఎదురుచూస్తూ ఉన్నారు. అంతగా ప్రభాస్ మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వ్యాపించింది.
ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుంది. మార్చి 11 వ తారీఖున సినిమా రిలీజ్ కామ తరుణంలో తాజాగా ఈ సినిమా యునైటెడ్ కింగ్ డామ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో… నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా… 130k డాలర్లు..ప్రీ సేల్స్ గా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
అదే సమయంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా 400K డాలర్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ రీతిగా ఓవర్సీస్లో కలెక్షన్లు రావడంతో.. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు గల్లంతు అని అంటున్నారు. డీజే సమయం లో తెలుగు రాష్ట్రాలలో కూడా.. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతున్నటు టాక్. ప్రేమకథా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్.. లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైం పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటించడం తో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.