Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 5 సంవత్సరాల నుండి ఒక హిట్టు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కెరియర్ పరంగా “బాహుబలి 2” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది. డిసెంబర్ మొదటి తారీకు “సలార్” ట్రైలర్ రిలీజ్ కానుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పైన్నే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ కచ్చితంగా హిట్ ఇస్తాడని భావిస్తున్నారు.
ఆల్రెడీ “కేజిఎఫ్” సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. “కేజిఎఫ్” సినిమాతో హీరో యాష్ ఓవర్ నైట్ లోనే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ రావడం జరిగింది. కేజిఎఫ్ విడుదల అవ్వకముందు యాష్ పేరు కన్నడలో మాత్రమే వినబడేది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారు మ్రోగుతోంది. కాగా “సలార్” పక్కన పెడితే.. ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా సందీప్ రెడ్డి వంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభాస్ తో చేయబోయే “స్పిరిట్” సినిమా షూటింగ్… వచ్చే ఏడాది సెప్టెంబర్ 24వ తారీకు మొదలుకానున్నట్లు తెలిపారు.
ఇటీవల బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి రావటం జరిగింది. సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాకుండా “యానిమల్” సినిమా హీరో రణబీర్ కపూర్.. కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభాస్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 24 అని సందీప్ రెడ్డి వంగా సమాధానం ఇచ్చారు. “యానిమల్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సందీప్ రెడ్డి వంగా.. “అన్ స్టాపబుల్” షోలో పాల్గొని… ఈ వ్యాఖ్యలు చేయడం తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనంగా మారింది.