ఈ ఐదు ఏళ్లలో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ రెండే సినిమాలు చేశాడు.బాహుబలి సిరిస్ కోసం నాలుగేళ్ళ కేటాయించిన ప్రభాస్ ,ఆ తరువాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తాడనుకుంటే, మళ్లీ ఫ్యాన్స్ వెయిట్ చేయించాడు. సుజీత్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో తెరకెక్కుతున్న సాహో సినిమా స్టార్ట్ అయిన రెండేళ్లు అవుతుంది. హాలీవుడ్ స్టాయిలో రూపోందుతున్న ఈ సినిమా ఇంత టైం తీసుకోవడానికి కారణం గ్రాపీక్స్ వర్క్. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఆగస్టు 15న సాహోని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాహో సినిమా లేట్ అవుతుందని భావించిన ప్రభాస్, ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్లో యూరప్ బ్యాక్ డ్రాప్లో పిరియాడికల్ రోమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.ఈ మూవీకి జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని విలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారట చిత్రటీమ్. అయితే సాహో కోసం ఫ్యాన్స్ని రెండేళ్ళు వెయిట్ చేయించిన ప్రభాస్ ఇప్పుడు ఆ వెయిటింగ్ని మరిపించేలా ఈ ఏడాదిలో రెండు సినిమాలను రిలీజ్ చేసి ఫ్యాన్స్కు డబుల్ కిక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది..
డార్లింగ్ తరువాత ప్రభాస్ చేస్తున్న లవ్ స్టోరీ కవడంతో ఈ సినిమాపై హై రేంజ్లో ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని 2020లో జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనుకున్న టైం కన్నా ముందే సినిమా కంప్లీట్ అయ్యే అవకాశం ఉండడంతో నవంబర్లోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారట. ఈ ఐదేళ్లలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన ప్రభాస్ ఓకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తుడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాలతో డార్లింగ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.