అమరావతి: వైసిపి ప్రభుత్వంలో అధికారుల చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కడప జిల్లాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని టిడిపి నేతలు ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలను.ఫ్లెక్సీలను అధికారులు తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. పసుపు జెండా చూడగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. సిఎం సొంత జిల్లాలో తెలుగుదేశంకు వస్తున్న ఆదరణ చూసి వైసిపి హడలిపోతోందని వెంకట్రావు అన్నారు.
ప్రభుత్వకార్యాలయాలకు, జాతీయ జెండాలతో పాటు మహాత్మా గాంధీనీ వదలకుండా వైసిపి రంగులు వేస్తే నోరుమెదపని అధికారులు తెలుగుదేశం ప్లెక్సీలను అనుమతి లేదంటూ తొలగించటం ఎమిటని కళా వెంకట్రావు అన్నారు.ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇతర పార్టీ జెండాలు,ప్లెక్సీలు కట్టడానికి వీల్లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కులేదా?ఇది ప్రజాస్వామ్యమూ లేక రాజరిక వ్యవస్ధా ? అని ప్రశ్నించారు.ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అన్న సంగతి అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?