విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు సర్కారు ప్రకటిస్తే తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘నిరా రక్షత, దీవితాన్ని, సంఘ సస్కర్తలు, రాజిక సౌద్దన్నాన్ని అని మీ తింగరి మాలోకం చదివిన తరువాత మీకు తెలుగుపై కోపం రావడం సహజం. చూసి చదవడం రానంత మాత్రాన ఎటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నట్టుండి తెలుగు మీడియం స్కూల్స్ అన్నిటినీ ఇంగ్లిష్ మీడియంగా చేసేస్తాం అంటే ఎలా ఎంపీ విజయసాయి రెడ్డి గారు?’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
@ysjagan గారూ, మీ వైకాపా బ్యాచ్ ప్రకారం మీరు పెద్ద తెలుగుపండితులు కదా, స్క్రిప్ట్ చదువుతూ తెలుగుకి తెగులు పట్టించడం ఏంటండీ? @VSReddy_MP గారూ ఇదంతా మీ ట్రైనింగే కదా !!
హహ! పేటీఎం బ్యాచ్ మీ అన్నకోసం ఇక కవరింగ్ మొదలెట్టండి! pic.twitter.com/QlcSlsJIu9— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) November 2, 2019
అన్నట్టు మీ దొంగ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హై లైట్. చంద్రబాబు గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతా అంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు అని మీ పత్రిక రాసింది.కాస్తైనా మీలో సిగ్గు ఉంటే నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నా.
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) November 8, 2019
‘అన్నట్టు మీ దొంగ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హైలైట్. చంద్రబాబు గారు ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పెడతానంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు అని మీ పత్రిక రాసింది. కాస్తయినా మీలో సిగ్గు ఉంటే, నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నాను’ అని వరుస ట్వీట్లు చేశారు.
అగ్రి గోల్డ్ బాధితుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబర్చుతోన్న తీరుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ‘ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరు స్వయంగా బెదిరించారు గుర్తులేదా? అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు ఆ బిల్డ్అప్ లు ఆపండి. చిత్తశుద్ధి ఉంటే దగా యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వారంలో రూ.1,150 కోట్లు జగన్ గారితో విడుదల చేయించండి విజయసాయి రెడ్డి గారు’ అని డిమాండ్ చేశారు.
‘ఎటెట్టా ప్రజా దగా యాత్రలో ఇచ్చిన హామీని జగన్ గారు నిలబెట్టుకున్నారా? చంద్రబాబు గారు కేటాయించిన రూ.363 కోట్లలో కోత పెట్టి రూ.264 కోట్లు మాత్రమే ఇచ్చారు. విజయవాడ, హైదరాబాద్ హోటల్స్ లో కూర్చొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా కేసులు వేయించిన విషయం మర్చిపోయారా?’ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.
ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరు స్వయంగా బెదిరించారు గుర్తులేదా? అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు బిల్డ్అప్ ఆపండి. చిత్తశుద్ధి ఉంటే దగా యాత్ర లో ఇచ్చిన హామీ ప్రకారం వారంలో 1150 కోట్లు జగన్ గారితో విడుదల చేయించండి విజయసాయి రెడ్డి గారు
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) November 8, 2019