తెలంగాణాలో కరోనా విఆలయతాండవం చేస్తుంది…! సముద్రం నుండి సునామి వచ్చినట్టుగా రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టులు చుస్తే చాల తక్కువగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అక్కడ 25 శాతం పైగా పాజిటివ్ రేటు నమోదవుతుంది…! కరోనాతో పాటూ అక్కడ రాజకీయమో పెరిగిపోయింది. కొత్త డిమాండ్లు, సరికొత్త ప్రతిపాదనలతో విమర్శల దాడి మొదలయ్యింది. కానీ సమాధానమే కరువయ్యింది…!
ఫాఫం కేసీఆర్. కరోనాతో కత్తి వీరుడిలా పోరాడతాడు అనుకుంటే కనీసం కట్టే పుల్ల వీరుడిలా కూడా పోరాడట్లేదు. కేసులు పెరుగుతున్న వేళ అక్కడ కేసీఆర్ కనిపించకపోవడం.., ఇటు తండ్రికి తగ్గ కొడుకుగా ఉన్న కేటీఆర్ కూడా కనిపించకపోవడం… మామపై మచ్చ పడనీయని హరీష్ రావు కూడా మాయమవ్వడం ప్రతిపక్షాలకు ఆయుధాలు దొరికాయి. మూకుమ్మడి దడి మొదలయ్యింది. అసలే ప్రత్యర్థి ఒక మాట అంటే పది మాటలు బదులిచ్చే కేసీఆర్ లేకపాయె.. ఇంకేముంది ఇన్నాళ్లు మాట్లాడని పొన్నాల లక్ష్మయ్య.., బండి సంజయ్.., లాంటి నాయకులు ఇప్పుడు పదునైన విమర్శలు చేస్తున్నారు. పొన్నాల అయితే ఏకంగా తెలంగాణాలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ పైకి తీసుకొచ్చారు.
రేవంత్ రెడ్డి అయితే ఇంకొన్ని అడుగులు ముందుకు వేసి… కేసీఆర్ కి కరోనా అని వార్తలు వస్తున్నాయి, అది బయటకు చెప్పాలని డిమాండ్ చేసారు. సీఎం ఆరోగ్య స్థితిని తెలియజేయాలని కోరారు. కేసీఆర్ ఒకవేళ పరిపాలన అందించలేని స్థితిలో ఉంటె కేటీఆర్ కో, హరీష్ కో పాలన అప్పగించాలని కొత్త డిమాండ్ తెచ్చారు. రాష్ట్రంలో కరోనాపై కనీసం సమీక్ష చేయకుండా.., పాలనను గాలికి వదిలేసినా సీఎం దేశంలో ఏ ఒక్కరూ లేరని గుర్తు చేస్తూ.., గవర్నర్ వెంటనే పట్టించుకోవాలని కోరారు.
మొదటిసారి ప్రతిపక్షాల విమర్శలకు అధికార టీఆరెస్ పక్షం నుండి సమాధానాలు రావడం లేదు. ఆ పార్టీలో ధాటిగా మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు సమాధానం ఇచ్చేవారు కరవయ్యారు. అందుకే రెండు ప్రతిపక్షాలు అధికార పక్షంపై మూకుమ్మడి దాడి మొదలు పెట్టాయి. ఇంతటి బిజీ వేళలో.., తెలంగాణాకి రాష్ట్రపతి పాలన అనే అంశం మోడీ ఆలోచిస్తారు, అమలు చేస్తారు అనుకోవడం దున్నపోతుకు పాలు పిండినట్టే..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?