అమరావతి: కృష్ణపట్నం పోర్టు విశేష అధికారాలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారని, ఇప్పుడు సీఎం జగన్ వచ్చిన తర్వాత కృష్ణపట్నం ముఖపరిధిని తగ్గించి రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తున్నాడని మరో దొంగ వార్తను వండి వార్చారని అన్నారు. దొంగసొమ్ముతో ఏర్పాటైన సాక్షి చానల్, పేపర్ లో రాసేవన్నీ తప్పులేనని జగనే అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. వాస్తవానికి కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టింది మహామేత వైఎస్సార్ అని తెలిపారు. 2008లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 40నే దీనికి సాక్ష్యం అని వెల్లడించారు. వినేవాళ్లు ఉంటే జగన్ ఎవరి చెవిలోనైనా పువ్వు పెట్టేస్తారని ఎద్దేవా చేశారు. ”తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అడ్డగోలుగా దోపిడీ చేసి ఆ పాపాలు వేరేవారి ఖాతాలో ఎలా వేస్తే ఎలా జగన్ గారూ?” అంటూ లోకేశ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి ఛానల్, పేపర్ లో రాసే వార్తలు అన్నీ తప్పే అని @ysjagan గారు స్వయంగా శాసనసభలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి దొంగ వార్త వండి వార్చారు.(1/3) pic.twitter.com/yJbUFYrb2O
— Lokesh Nara (@naralokesh) December 31, 2019
కృష్ణపట్నం పోర్టుకి విశేష అధికారాలు కట్టబెట్టింది మహమేత వైఎస్సార్, 8.10.2008న వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 40 దీనికి సాక్ష్యం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచేసి ఆ పాపాలు వేరే వారి ఖాతాలో వేస్తే ఎలా జగన్ గారు?(3/3)
— Lokesh Nara (@naralokesh) December 31, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?