అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.. అమరావతిని తరలించాలన్న మీ దురాలోచన మానుకోండి. అమరావతి రాజధానిగా సముచితమని విజ్ఞులందరూ చెబుతున్నారు. పెద్దలమాట పెడచెవిన పెట్టి భ్రష్ట చెరితులు కాకండి. ఈ పాపం తరతరాలకు మిమ్ము వెంటాడుతుంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. సదాలోచన చెయ్యండి’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి గారు! అమరావతిని తరలించాలన్న మీ దురాలోచన మానుకోండి. అమరావతి రాజధానిగా సముచితమని విజ్ఞులందరు చెపుతున్నారు. పెద్దలమాట పెడచెవిన పెట్టి భ్రష్ట చెరితులు కాకండి. ఈ పాపం తరతరాలకు మిమ్ము వెంటాడుతోంది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టంది సార్. సదాలోచన చెయ్యండి.
— Varla Ramaiah (@VarlaRamaiah) January 2, 2020