Ys Jagan: కరోనా లాంటి కష్టకాలంలో దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు.. మరోలా ఉన్నాయి అంటూ పక్క రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. మహమ్మారి కరోనా వైరస్ చికిత్స విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు తమ రాష్ట్రాలలో కూడా పాలకులు తీసుకోవాలని ప్రజల పట్ల అక్కడికి ప్రతిపక్షాలు పోరాడుతూ ఉన్నాయి. కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏపీలో పాలన జరుగుతుంది అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించడం తెలిసిందే. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 28,30,227 ఇళ్ల నిర్మాణనికి పూనుకోవటం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలం తో పాటు ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సన్నద్ధం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేదల పట్ల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేరే దిశగా జగన్ ప్రభుత్వం.. భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో “వైఎస్ఆర్ జగనన్న కాలనీల” పథకం చర్చనీయాంశంగా మారింది. నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే హామీ జగన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే.. ఇవ్వటంతో ఆ హామీని ఇప్పుడు నెరవేర్చే దిశగా అడుగులు వేయడం జరిగింది.
Ys Jagan: పేద ఆడవాళ్లను లక్షాధికారులు గా మార్చిన జగన్
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31లక్షల మంది ఆడవాళ్ళ పేరిట ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థలాన్ని బట్టి విలువ చూస్తే ప్రతి లబ్ధిదారు ఆడవాళ్ళ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆస్తి విలువ వచ్చినట్లయింది అని అంటున్నారు. ఈ బృహత్తరమైన కార్యక్రమం పట్ల వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో కష్టకాలంలో పేద ఆడవాళ్లను లక్షాధికారులుగా జగన్ ప్రభుత్వం మార్చింది అంటూ సోషల్ మీడియాలో .. ఇస్తున్న హామీలను జగన్ అమలు చేయడం పట్ల కామెంట్లు పెడుతున్నారు.
Ys Jagan: ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక మెటీరియల్
అంతమాత్రమే కాకుండా ఈ ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక, మెటీరియల్ వస్తువులు తక్కువ ధరకే సరఫరా చేయడానికి రివర్స్ టెండరింగ్ అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ క్రమంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులు కోసం సిమెంట్, ఇతర వస్తువులను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేయటానికి జగన్ ప్రభుత్వం పూనుకుంది. ప్రతి ఇంటి నిర్మాణం కోసం దాదాపు 20 మెట్రిక్ టన్నుల ఇసుక దగ్గరలో ఇసుక రీచ్ ల ద్వారా అందించాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. అంత మాత్రమే కాక అర్హత ఉంది ఇంటిస్థలం రాకపోతే .. పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఎవరైనా సరే వెంటనే సమీప గ్రామ/ వార్డు సచివాలయంలో పేరు నమోదు చేసుకోవాలని 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందని తాజాగా జగన్ ప్రభుత్వం తెలిపింది.