న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్పై నరేంద్ర మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని గందరగోళంలోకి నెట్టింది. ఆర్టికల్ 370రద్దు, జమ్ము కశ్మీర్ను రెండుగా విభజించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం ఉన్న కొద్ది సమయంలోనే కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఈ విషయంపై చర్చించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసిందని ఎన్డిటివి పేర్కొన్నది. ఆ చర్చల దరిమిలా జమ్ము కశ్మీర్పై కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
అయితే పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కొందరు కట్టుబడకపోవడం కాంగ్రెస్ను కాస్త ఇబ్బందిలోకి నెట్టింది. కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించారు కూడా.
కేంద్రం చర్యను సమర్థించాలా, వ్యతిరేకించాలా అన్న మీమాంస వచ్చినప్పుడు, జమ్ము కశ్మీర్ ప్రజలను, శాసనసభను ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోకుండా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందేనని పార్టీ నేత సోనియా గాంధీ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది
previous post
next post