ముంబైలో ఓ వర్ధమాన నటి ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు పెర్ల్ పంజాబీ. సినిమాల్లో నటించాలనే ఆశతో ముంబై వచ్చిన ఆమెకు.. సినీ అవకాశాలు దక్కలేదు. చిన్నా చితకా కేరక్టర్లు తప్పితే… హీరోయిన్ గా ఛాన్సులు మాత్రం రాలేదు. ఈ విషయమై ఆమె తన తల్లితో కూడా గొడవ పడేది. అవకాశాలు రాక మెంటల్గా డిస్టర్బ్ అయిన పంజాబీ… సూసైడ్ చేసుకుంది. ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
రాత్రి భవనం వద్ద ఎదో భారీ శబ్దం వస్తే బయటకి వచ్చి చూశానని..కింద రక్తపు మడుగులో పంజాబీ గిలగిలా కొట్టుకుంటూ కనిపించిందని అపార్ట్ మెంట్ వాచ్ మెన్ తెలిపారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఆమె రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.