వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్ను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించారు.
బడ్జెట్ ప్రధానాంశాలు
మొత్తం బడ్జెట్ : రూ. రెండు లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలు
రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు
బడ్జెట్ అంచనా 19.32 శాతం పెరుగుదల
రెవెన్యూ వ్యయం 20.10శాతం పెరుగుతుందని అంచనా
కేటాయింపులు:
రాజధాని అమరావతికి రూ.500 కోట్లు
సాగునీటి శాఖకు 13,139 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసాకు 8750 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు
ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు
వైఎస్ఆర్ 9గంటల ఉచిత విద్యుత్కు రూ.4525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు
విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు
ఫసల్ బీయా యోజనకు రూ.1163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ రూ.475 కోట్లు
వైఎస్ బోర్ వెల్పథకానికి రూ.200 కోట్లు
విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
స్కూళ్లలో మౌలికవసతులకు రూ.1500 కోట్లు
మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు
వైఎస్ఆర్ స్కూల్ మెయింటనెన్స్ గ్రాంట్ రూ.160 కోట్లు
ఆరోగ్యశ్రీ రూ.1740 కోట్లు
ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు
ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు
వైఎస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజి- రూ.66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజి -66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజి -66 కోట్లు
శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లు
వైఎస్ఆర్ గృహవసతికి రూ 5వేల కోట్లు
పట్టణాల్లో ప్రధాని ఆవాస్ యోజనకు రూ.1370 కోట్లు
బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు
వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్కు వెయ్యి కోట్లు