(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విధంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.