NewsOrbit
టాప్ స్టోరీస్

డిఫెన్స్‌లో చంద్రబాబు!

అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని బుధవారం కూల్చివేయాలని జగన్ నేడు కలక్టర్ల సమావేశంలో ప్రకటించారు.

ఈ నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిఫెన్స్‌లో పడవేయకతప్పదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ నిర్మాణం చేపడితే ఏం చేయాలని జగన్ ప్రశ్నించారు. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చుని  పర్యావరణం గురించి సమీక్ష జరపడం ఎంత హాస్యాస్పదమో ఆలోచించాలని ఆయన అన్నారు. ఆచరించి చూపుదాం. ఇదే ఇక్కడ చివరి సమావేశం. రేపు ఎస్‌పిల సమావేశం జరుగుతుంది. ఎల్లుండి దీనిని కూల్చివేయండి అని జగన్ ఆదేశించారు.

ప్రజావేదికను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్న సంగతి అలా ఉంచితే, ప్రతిపక్ష నేతగా తన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు దానిని తనకు కేటాయించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి వర్తమానం రాలేదు. కలక్టర్ల సమావేశం కోసం ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నపుడు టిడిపి నాయకులు అభ్యంతరం వెలిబుచ్చారు కూడా. తమ పార్టీ అధినేత విదేశీ పర్యటనలో ఉన్నపుడు ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు.

చంద్రబాబు విజ్ఞప్తికీ, టిడిపి నాయకుల విమర్శలకూ ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్ల సమావేశంలో తన ప్రసంగం ద్వారా జవాబిచ్చారు. ఏడున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయాలని ఆయన నిర్ణయం తీసుకోవడం సాహసోపతమైన చర్య కిందకే వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సంగతి అలా ఉంచితే కృష్ణానది ఒడ్డునే ఇంకా చాలా అక్రమ కట్టాడాలు ఉన్నాయి. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నివసించిన, ఇంకా  నివసిస్తున్న భవనం అక్రమ కట్టడమే. ఆ భవనం లింగమనేని రమేష్ అనే జనసేన నాయకుడికి చెందినది.

ఇంకా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, గణపతి సచ్చిదానంద స్వామి, మంతెన సత్యనారాయణ రాజు వంటివారికి కూడా అక్కడ నిషేధిత ప్రాంతంలో భవనాలు ఉన్నాయి. మొత్తం 158 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. ఇప్పుడు ప్రజావేదిక తర్వాత చంద్రబాబు నివాసం సహా అన్ని అక్రమ కట్టాడాలనూ జగన్ కూల్చివేయిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా కాలం నుంచీ ఈ అక్రమ కట్టాడాలపై దృష్టి పెట్టారు. ఆయన ప్రయత్నాల కారణంగానే వాటికి గతంలో గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు ఇచ్చింది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment