(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వర్షిణి హత్యకేసులో నిందితుడు రఫికి ఉరిశిక్ష
రాష్ట్రంలో సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య సంఘటన ముద్దాయిపై తుది తీర్పు సోమవారం వెలువడింది. అతనికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
గత సంవత్సరం నవంబర్ 7 వ తేదీ న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లోని ఓ కళ్యాణ మండపంలో నవంబరు 7వ తేదీన ఆరేళ్ల బాలికపై లారీ క్లీనర్ మహ్మద్ రఫీ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నవంబర్ 16వ తేదీన నిందితున్ని అరెస్టు చేశారు అప్పటినుంచి కేసు విచారణ జరుగుతుండగా సోమవారం తుది తీర్పు వెలువడింది. నిందితుని చిత్తూరు జిల్లా కోర్టు వద్ద కు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. నిందితుడిపై చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో), హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణను స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టు చేపట్టింది. మొత్తం 47 మంది సాక్షులను విచారించింది. కేసుపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తుది తీర్పును చిత్తూరు మొదటి న్యాయస్థానం వెలువరించింది.