నిధుల వివరాలు సమర్పించండి
పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు రహస్యంగా విరాళాలను సమకూర్చిపెట్టే ఎన్నికల బాండ్ల వ్యవస్థను కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, మే నెలాఖరులోగా అన్ని పార్టీలూ తమకు ఈ బాండ్ల ద్వారా ఎంతెంత మొత్తంలో విరాళాలు వచ్చాయనన విషయాన్ని మాత్రం తెలియజేయాలని ఆదేశించింది. ఈ వివరాలు సీల్డ్ కవరులో ఇవ్వాలని, అవి ఎన్నికల సంఘం వద్ద సురక్షితంగా ఉంటాయని కోర్టు తన రూలింగులో తెలిపింది.
ఎన్నికల సమయంలో పారదర్శకత కోసం ఎన్నికల బాండ్లను వెంటనే ఆపాలంటూ కాంగ్రెస్ నాయకులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాము క్షుణ్ణంగా పరిశీలించామని, ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తీసుకున్నామని కోర్టు తెలిపింది. ప్రస్తుతం దానిపై విచారణ జరగాలని, కానీ ఇంత తక్కువ సమయంలో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తులు అన్నారు. కోర్టు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, అదే సమయంలో ఏ పార్టీ వైపూ మొగ్గు ఉండకూడదని చెప్పారు.