చెన్నై: డిఎంకె అధినేత స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సమావేశమయ్యారు. చెన్నైలోని ఆళ్వర్పేటలోని స్టాలిన్ నివాసానికి కెసిఆర్ వెళ్లగా ఆయన సాదరంగా స్వాగతం పలికారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాలు, ఫేడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై స్టాలిన్తో కెసిఆర్ చర్చలు జరిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎంపిలు వినోద్, సంతోష్ కుమార్, డిఎంకె నాయకులు దురైమురుగన్, టిఆర్ బాలు తదితరులు ఉన్నారు.
ఏడు రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కెసిఆర్ భేటీ అయ్యారు. కెసిఆర్ ఒక పక్క కేరళ, తమిళనాడు ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ మరో పక్క దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే ఒక పర్యాయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పి నేత అఖిలేష్ యాదవ్ తదితరులను కలిసి ఫెడరల్ ఫ్రంట్పై చర్చించిన విషయం తెలిసిందే.
మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో కెసిఆర్ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమితో చక్రం తిప్పేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.