మే మూడు తో లాక్ డౌన్ ముగుస్తోందా…? ఇక సాధారణ జీవనంలోకి వెళ్లిపోవచ్చా? అన్నీ తెరుచుకున్నట్టేనా? ఇవన్నీ సగటు మనిషి సందేహాలే. దేశం మొత్తం కాళ్ళు, చేతులు కట్టుకుని ఇప్పటికీ నెల దాటింది. పనుల్లేవు, కూలీ లేదు, ఆదాయం లేదు, కొనుగోళ్లు లేవు, వర్తకం లేదు, పేదోడి ఇంటి ఖజానా నుండి దేశ ఖజానా వరకు పైసా ఆదాయం లేదు. మీ మూడుతో కష్టాలు తీరుతాయి అనుకుంటే అది కూడా అనుమానమే. కరోనా తగ్గడం లేదు. కేసులు పెరుగుతున్నాయి. అసలు మీ మూడు తర్వాత పరిస్థితులపై ప్రధాని మోడీ కూడా ఇంకా ఓకేనా నిర్ణయానికి రాలేదు. ముఖ్యంగా కరోనా కేసులు మే, జూన్ వరకు ఉంటాయని కొన్ని సర్వేలు చెప్తుండడం దేశంలో కొంత ఆందోళన కలిగిస్తుంది.
27 న సీఎంలతో చర్చలు …!
కరోనా తాజా పరిస్థితులు, రాష్ట్రాల్లో పరీక్షల వివరాలు, లాక్ డౌన్ విషయమై కీలక విషయాలు చర్చించడానికి ప్రధాని మోడీ ఈ నెల 27 న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఇతర చర్చల సంగతి ఎలా ఉన్నా లాక్ డౌన్ పొడిగింపుపైనే ముఖ్యంగా చర్చ జరుగుతుందని, సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగానే కరోనా కేసులు కొంచెమైనా అదుపులో ఉన్నాయి. లాక్ డౌన్ పాటించని దేశాల్లో జరుగుతున్నా కల్లోలం చూస్తూనే ఉన్నాం. మన కంటే ముందు నుండే ప్రపంచంలోని 29 దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి, ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. మన దేశంలో చూసుకుంటే ఇప్పటికీ కరోనా పాజిటివ్ ఉన్న వారి కాంటాక్ట్ ద్వారా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేటలో ఓ మహిళతో అష్టా చెమ్మ ఆడిన కారణంగా ౩౦ మందికి కరోనా సోకడం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ర్యాలీ కారణంగా కరోనా విజృంభించడం, ఇలా భౌతిక దూరం పాటించని చోటల్లా కరోనా నేనున్నాను అంటూ పలకరిస్తుంది. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు, వివిధ వర్గాల వారికి తాజాగా కేసులు బయటపడుతున్నాయి. అంటే మూలాల నుండి ఆ వైరస్ పూర్తిగా నియంత్రణ కాలేదు. ఎక్కడో ఓ చోట రోజు వారీ బయట పడుతూనే ఉంది. అందుకే పొడిగింపు దిశగా అడుగులు పడుతున్నాయి.
మే నెలాఖరు వరకు ప్రభావం …!
ఏప్రిల్ ఆరున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ ఈట్ లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలో ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ఆ నివేదిక ఊదా అప్పట్లో బయటకు అచ్చింది. దాని ప్రకారం దేశంలో జూన్ చివరి వరకు కరోనా కేసుల తీవ్రత ఉంటుందని పేర్కొన్నారు. సరే దానిలో వాస్తవికతని తిక్కన పెడితే ఇంజాన్ని సర్వేలు… పర్శంటేజ్ మోడల్, ది టైం సిరీస్, ససెప్టాబుల్ ఎక్సపోజ్డ్ అనే కొన్ని సంస్థలు ఇటీవల కొన్ని సర్వేలు చేశాయి. అంతర్జాతీయంగానూ కేసుల పరిస్థితి, దేశీయంగా పరిస్థితి చూసుకుని అంచనాకు వచ్చాయి. వాటి ప్రకారం కూడా దేశంలో మే నెలలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉండనుంది. లాక్ డౌన్ వలన దేశం ఆశించిన తగ్గుదల అయితే కనిపించలేదు. అయితే కోట్లాది, జనాభా , అత్యధిక జనసాంద్రత న్నా ప్రాంతాలుం కాబట్టి మన దేశంలో లాక్ డౌన్ అమలు కాకుంటే కేసులు ఈపాటికే అమెరికాను దాటేసేవి. లాక్ డౌన్ కొంత మేరకు ఫలితాలనిచ్చింది, అందుకే కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కేంద్రంలో పెద్దలు, అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే విషయాన్నీ సూచించారట,. అందుకే ఈనెల 27 తో ఒక అవగాహనవస్తుంది.వచ్చే నెల ఒకటి, లదా రెండు న లాక్ డౌన్ విషయమై మోడీ ప్రకటన చేసే అవకాశం ఉంది. పొడిగిస్తే మాత్రం మే నెలాఖరు వరకు ఉంటుందని అంచానాలు వేస్తున్నారు.