న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పలు ప్రశ్నలను సంధించారు. ఈ కేసులో తాను ఒక్కడినే తప్పు చేసినట్లు అధికారులు ప్రవర్తిస్తున్నారని, తనను ఒక్కడినే అరెస్టు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అన్నారు. ఈ మేరకు సోమవారం చిదంబరం కుటుంబ సభ్యులు ఆయన తరఫున ట్వీట్లు చేశారు. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటిదాకా ఏ ఒక్క అధికారి కూడా అరెస్టు కాలేదు. మీరు ఒక్కరే ఎందుకు అరెస్టు అయ్యారు అంటూ నన్ను పలువురు ప్రశ్నిస్తున్నారు’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) అధికారులు జారీ చేసిన ప్రతిపాదనలపై తాను సంతకం మాత్రమే చేశానని అన్నారు. తాను ఏ ఒక్క అధికారి మీదా నింద మోపబోనని, వారు అరెస్టు కావడం తనకు ఇష్టం లేదని చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
No officer has done anything wrong. I do not want anyone to be arrested.
— P. Chidambaram (@PChidambaram_IN) September 9, 2019
ఐఎన్ఎక్స్ మీడియాలో 307 కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన కేసు విషయంలో చిదంబరం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 21న అరెస్ట్ అయిన చిదంబరంను సెప్టెంబర్ 5న కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19 వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు.
मेरे पास कोई उत्तर नहीं है।
किसी भी अधिकारी ने कुछ भी गलत नहीं किया है। मैं नहीं चाहता कि किसी को गिरफ्तार किया जाए।
— P. Chidambaram (@PChidambaram_IN) September 9, 2019