పాట్న: బీహార్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. రాజధాని పాట్నా సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. పాట్నాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నలంద మెడికల్ కాలేజీలోకి వరద నీరు చేరింది. రోగులు ఉండే వార్డులు నీటితో నిండిపోయాయి. దీంతో పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలు కింద పెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.
#WATCH Bihar: Water-logging in Nalanda Medical College, Patna, following rainfall in the region. pic.twitter.com/njsbqYDKWX
— ANI (@ANI) September 28, 2019
మరోవైపు భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కంకర్బాగ్, రామకృష్ణ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతోపాటు పెరిగిపోయిన ట్రాఫిక్ రద్దీతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారులు పూర్తిగా దెబ్బతిని గోతులుగా తయారయ్యాయి. వర్షాల వల్ల రవాణా, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైలు సర్వీసుల్ని కూడా తాత్కాలింకగా నిలిపివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
#WATCH Vehicles wade through water at Dak Bunglow intersection in Patna, following heavy rainfall in the region. #Bihar pic.twitter.com/FD8txzywwd
— ANI (@ANI) September 28, 2019
#Bihar: Vehicles wade through water at Dak Bunglow intersection in Patna, following heavy rainfall in the region. pic.twitter.com/FxoH94w3Ze
— ANI (@ANI) September 28, 2019