(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాలజ్ఞానంపై బ్రహ్మంగారు ముందే చెప్పినట్లు.. కలియుగంలో అలాంటి వింత ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పంది ఏనుగు ఆకారంలో ఉన్న పిల్లకు జన్మనిచ్చింది. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఓ పంది రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒకటి సాధారణంగానే ఉండగా మరో పిల్ల మాత్రం తెల్లటి రంగులో చిన్నగా ఉండి ఏనుగు రూపాన్ని పోలి ఉంది. ఏనుగు లాగ తొండం కలిగి ఉంది. దీంతో అది పంది పిల్లా ? ఏనుగు పిల్లా ? అని ఆశ్చర్యపోయేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పంది పిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. జన్యుసంబంధింత లోపాల వల్లే ఇలా జరిగి ఉంటుందని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. ఇలాంటివాటి గురించి విన్నప్పుడల్లా ప్రజలంతా బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతుందని చర్చించుకుంటుంటారు.
గతంలో 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో ఇలాంటి పిల్లలు పుట్టాయి. పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించడంలో భగవంతుడి మాయ మర్మాలు ఏమీ లేవని, జంతువులలోని జన్యులోపాల కారణంగా వికృక రూపంలో జన్మించి ఉండవచ్చని విజ్ఞాన వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పంది కడుపులో ఏనుగు పిల్ల కాదని జన్యు లోపం కారణంగానే ఏనుగు రూపంలో పంది జన్మనిచ్చిందని వారు అంటున్నారు.