కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ చేసే పరిస్థితులు తేవద్దని టిజి సూచించారు. స్టడీ పేరుతో కాలయాపన చేసే కంటే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇస్తే సరిపోతుందని టిజి అన్నారు.
రాయలసీమ డిక్లరేషన్ అమలయ్యే వరకూ పోరాటం ఆగదని టిజి చెప్పారు.
రాజధాని అంశంపై విశ్రాంత ఐఎఎస్ అధికారి జిఎస్ రావు నేతృత్వంలో ప్రభుత్వం నియమింపబడిన నిపుణుల కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్న తరుణంలో ఎంపి టిజి వెంకటేష్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.