(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రియాంకరెడ్డిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చినట్లు తేల్చారు. ప్రియాంక రెడ్డి తన స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రియాంకరెడ్డిని తీసుకెళ్లిన నిందితులు అక్కడే అత్యాచారం చేశారని.. ఆ తరువాత శరీరానికి దుప్పటి చుట్టి కాల్చి చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లలో నిందితుల దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. నవబంర్ 27న గచ్చిబౌలిలో చికిత్స నిమిత్తం స్కూటీ మీద బయలుదేరిన ప్రియాంక రెడ్డి.. తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద తన వాహనాన్ని పార్క్ చేసి గచ్చిబౌలి వెళ్లి వచ్చారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తొండుపల్లి చేరుకున్న ప్రియాంకను నిందితులు ట్రాప్ చేసి అఘాయిత్యం చేశారు.
https://youtu.be/kLOGP2zZKJk
నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రియాంకరెడ్డిని అపహరించి పోలీసులు నిర్ధారించారు. ప్రియాంకరెడ్డి స్కూటీని నిందితులు ఉద్దేశపూర్వకంగానే పంక్చర్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. టోల్ గేట్ వద్ద ప్రియాంకరెడ్డి తన బైక్ ను పార్క్ చేసి వెళ్లింది. ఈ విషయాన్ని నిందితులు గమనించారు. ఆమె తిరిగిరాక ముందే ఆ స్కూటీ టైర్ ను నిందితులు పంక్చర్ చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రియాంక.. స్కూటీ టైర్ పంక్చర్ అయిందని, ఇంటికి ఎలా వెళ్లాలని కంగారు పడింది. ఆ సమయంలో అక్కడకు వచ్చి, సాయం చేస్తున్నట్లు నటించిన నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తొండుపల్లి జంక్షన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి 28 కి.మీ. దూరంలోని షాద్నగర్ వరకు తీసుకెళ్లారు. షాద్నగర్ రహదారిపై ఓ పెట్రోలు బంక్లో ఇద్దరు అనుమానితులు బాటిల్లో పెట్రోలు నింపుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితులు ఉపయోగించిన స్కూటీ ప్రియాంక రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. గురువారం (నవంబర్ 28) తెల్లవారుజామున చటాన్పల్లి వంతెన కింద మృతదేహాన్ని దహనం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం స్థానిక పాల వ్యాపారి మృతదేహం తగలబడుతున్నట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే..పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రియాంక తల్లి విజయమ్మ పేర్కొన్నారు. తమ పరిధిలోకి రాదంటూ రెండు పోలీస్ స్టేషన్లకు తిప్పారని వాపోయారు. పోలీసులు సకాలంలో స్పందించే ఉంటే తమ కూతురు ప్రాణాలతో దక్కేదని..వారి తీరు తమని బాధ పెట్టిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యలను రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. వెంటనే ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చాలా మంది యువతులు పనిచేస్తున్న హైదరాబాద్ నగరంలో జరిగిన భయంకరమైన సంఘటన తీవ్రంగా కలిచివేసిందని జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఆడపిల్లలు తిరగడానికి ఏ మాత్రం రక్షణ లేనప్పుడు వారు ఎలా స్వతంత్రంగా ఉండగలరని ఆమె అభిప్రాయపడ్డారు.
Sending a member to Hyderabad to assist the family and take it up with the police @NCWIndia won't leave any stone unturned till these perpetrators get the punishment they deserve. https://t.co/kYBQivLKN0
— Rekha Sharma (@sharmarekha) November 29, 2019