అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది నిజమైన అమరావతి అంటూ పలు కట్టడాలను వీడియోలో చూపారు. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంలోనూ వైసిపి మరోసారి ఇదే రకమైన విమర్శలు చేసింది. అమరావతిలో ఏం ఉందని చంద్రబాబు చూడటానికి వస్తున్నారని వైసిపి నేతలు, మంత్రులు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం టిడిపి నేతలు అక్కడ నిర్మాణాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు.
డ్రోన్ కెమెరాలను అక్రమంగా వినియోగించారంటూ వైసిపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అమరావతి గ్రాఫిక్స్ కాదు..
ఇది నిజమైన అమరావతి pic.twitter.com/xBnqsoLu4y— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 29, 2019