న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకూ ఒకేసారి ఎన్నిక జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. బిజెపి తరపున లోక్సభకు ఎన్నికయిన అమిత్ షా, స్మృతి ఇరానీ రాజీనామాల వల్ల ఈ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి.
జూలై అయిదవ తేదీనే రెండిటికీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రెండిటినీ విడివిడిగా పరిగణిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటిచింది. దానితో గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు పరేష్భాయి ధనానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జూన్ 24వ తోదీ లోగా ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తమ స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. జూన్ 25న కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇది పరిశీలించాల్సిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అమిత్ షా సీటు మే 23న ఖాళీ కాగా, స్మృతి సీటు మరుసటిరోజు ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఈ కారణంగా రెండు సీట్ల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.